Kumbh Mela: “వక్ఫ్” భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..
- వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారు..
- ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు..
- ముస్లింలు కుంభమేళాకు అనుమతించకపోవడంపై అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది యోగి సర్కార్. మరికొన్ని రోజుల్లో కుంభమేళా ప్రారంభం కాబోతోంది. అయితే, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని, దీనికి అనుమతించడం ద్వారా ముస్లింలు పెద్ద మనసుని చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముస్లింలను కూడా అనుమతించడం ద్వారా హిందువులు ప్రతిస్పందించాలని కోరారు.
Read Also: Bombay High Court: ఒక్కసారి మాత్రమే అమ్మాయిని ఫాలో అవ్వడం వేధించడం కాదు..
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
దాదాపు 34 ఎకరాల భూమిని హిందూ మతపరమైన కార్యక్రమానికి వినియోగిస్తు్నారని బరేల్వీ పేర్కొన్నారు. హిందూయేతరులు కుంభమేళాకు రాకుండా అడ్డుకోవాలని భారత అఖారా పరిషత్ పిలుపు ఇవ్వడాన్ని బర్వేలీ తప్పుపట్టారు. కుంభమేళా నుండి ముస్లింల ప్రవేశాన్ని అఖారా పరిషత్, నాగ సన్యాసులు, స్వామీలు మరియు బాబాలు నిషేధించారు. సర్తాజ్ అనే ముస్లిం వ్యక్తి కుంభమేళా జరుగుతున్న స్థలం వక్ఫ్కి చెందుతుందని, అది స్థానిక ముస్లింలకు సొంతమని చెప్పాడు.
ముస్లింలు భూములు ఇస్తూ విశాల మనసుతో వ్యవహరిస్తుంటే, కుంభమేళాకు ముస్లింలను అనుమతించకుండా హిందూ సంఘాలు సంకుచితతత్వాన్ని ప్రదర్శిస్తున్నాయని బర్వేలీ విమర్శించారు. అయితే, ఈ వ్యాఖ్యలను హిందూ నేతలు తోసిపుచ్చారు. హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ మాట్లాడుతూ మౌలానా షహబుద్దీన్ను పాకిస్థాన్ స్పాన్సర్ చేస్తుందని ఆరోపించారు. అతను ఉగ్రవాద మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అన్నారు. కుంభమేళకు భంగం కలిగించేందుకు ఇలాంటి వారు వ్యవహరిస్తున్నారని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
-
Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
-
Tamannaah: ‘బాహుబలి’ ఫ్లాప్ అయ్యేదే.. తమన్నా షాకింగ్ కామెంట్స్ వైరల్!
-
Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
-
Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!