UP News: న్యూ ఇయర్ రోజు ప్రేయసిని కలిసేందుకు వచ్చాడు.. ఆ తర్వాత దారుణం..
- ఉత్తర్ ప్రదేశ్లో దారుణం..
- యువతి, ఆమె ప్రేయసిని హత్య చేసిన కుటుంబం..
- ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP News: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. ప్రేమ జంటను యువతి కుటుంబీకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన యూపీలోని లలిత్పూర్ జిల్లాలో న్యూ ఇయర్ రోజు జరిగింది. 22 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల యువతిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని, ఆ తర్వాత హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సోమవారం పోలీసులు తెలిపారు. యువతి తండ్రి, తల్లి, మామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
చనిపోయిన వ్యక్తిని మిథున్ కుష్వాహాగా, యువతిని కామినీ సాహుగా గుర్తించారు. లలిత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జఖౌరా ప్రాంతంలోని బిఘా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ముహమ్ద్ ముస్తాక్ ప్రకారం.. వీరిద్దరు కలిసి ఉండటం యువతి కుటుంబానికి ఇష్టం లేదు. దీనిపై గతంలో పంచాయతీ జరిగింది. సాహు పెళ్లి చేసుకునే వరకు కుష్వాహా గ్రామానికి దూరంగా ఉండాలని పెద్దలు ఆదేశించారు. మిథున్ కుష్వాహా గ్రామం వెలుపల తన మామతో కలిసి ఉంటున్నాడు. అయితే, అర్థరాత్రి కామినీ సాహు ఇంటికి రహస్యంగా వెళ్లేవాడు.
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
Read Also: Earthquake: హిమాలయాల్లో ఏదో రోజు విధ్వంసమే.. భూకంపాలకు కారణమేంటి..?
మిథున్ కుష్వాహా తమ కుమార్తెను రహస్యంగా కలిసేందుకు వస్తున్నాడని తెలిసింది. సాహు పుట్టిన రోజైన జనవరి 01న మళ్లీ వస్తాడని తెలుసుకుని కుటుంబం మొత్తం కలిసి హత్యలకు ప్లాన్ చేశారు. అర్థరాత్రి ఇంటికి వచ్చిన మిథున్ కుష్వాహాన కాళ్లను కట్టేసి, బలవంతంగా విషం తాగించి, ఆపై గొంతు కోసి చంపారు. దీనిపై కామినీ సాహు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆమెకు కూడా విషం తాగించి, గొంతు కోసి చంపారు.
అయితే, ఈ హత్యల్ని ఆత్మహత్యలుగా మార్చే ప్రయత్నం చేశారు. వ్యక్తి మృతదేహాన్ని చెట్లుకు వేలడదీశారు. యువతి మృతదేహాన్ని తమ ఇంటి వెనక పడేసినట్లు ఎస్పీ తెలిపారు. మహిళ కుటుంబం మొత్తం యువతి తప్పిపోయినట్లు నటించారు. గ్రామస్తులతో కలిసి ఆమెను వెతికారు. రెండు మృతదేహాలను గుర్తించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రాథమికంగా ఆత్మహత్యలుగా అనుమానించిన పోలీసులు, డెడ్బాడీలను పోస్ట్మార్టంకి తరలించారు. అయితే, రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో యువతి తండ్రి సునీల్ సాహు, ఆమె తల్లి రాందేవి సాహు, ఆమె మామ దేశరాజ్ సాహుని అరెస్ట్ చయేశారు.
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!