UP News: న్యూ ఇయర్ రోజు ప్రేయసిని కలిసేందుకు వచ్చాడు.. ఆ తర్వాత దారుణం..
- ఉత్తర్ ప్రదేశ్లో దారుణం..
- యువతి, ఆమె ప్రేయసిని హత్య చేసిన కుటుంబం..
- ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం..
UP News: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. ప్రేమ జంటను యువతి కుటుంబీకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన యూపీలోని లలిత్పూర్ జిల్లాలో న్యూ ఇయర్ రోజు జరిగింది. 22 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల యువతిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని, ఆ తర్వాత హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సోమవారం పోలీసులు తెలిపారు. యువతి తండ్రి, తల్లి, మామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
చనిపోయిన వ్యక్తిని మిథున్ కుష్వాహాగా, యువతిని కామినీ సాహుగా గుర్తించారు. లలిత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జఖౌరా ప్రాంతంలోని బిఘా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ముహమ్ద్ ముస్తాక్ ప్రకారం.. వీరిద్దరు కలిసి ఉండటం యువతి కుటుంబానికి ఇష్టం లేదు. దీనిపై గతంలో పంచాయతీ జరిగింది. సాహు పెళ్లి చేసుకునే వరకు కుష్వాహా గ్రామానికి దూరంగా ఉండాలని పెద్దలు ఆదేశించారు. మిథున్ కుష్వాహా గ్రామం వెలుపల తన మామతో కలిసి ఉంటున్నాడు. అయితే, అర్థరాత్రి కామినీ సాహు ఇంటికి రహస్యంగా వెళ్లేవాడు.
Also Read
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
Read Also: Earthquake: హిమాలయాల్లో ఏదో రోజు విధ్వంసమే.. భూకంపాలకు కారణమేంటి..?
మిథున్ కుష్వాహా తమ కుమార్తెను రహస్యంగా కలిసేందుకు వస్తున్నాడని తెలిసింది. సాహు పుట్టిన రోజైన జనవరి 01న మళ్లీ వస్తాడని తెలుసుకుని కుటుంబం మొత్తం కలిసి హత్యలకు ప్లాన్ చేశారు. అర్థరాత్రి ఇంటికి వచ్చిన మిథున్ కుష్వాహాన కాళ్లను కట్టేసి, బలవంతంగా విషం తాగించి, ఆపై గొంతు కోసి చంపారు. దీనిపై కామినీ సాహు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆమెకు కూడా విషం తాగించి, గొంతు కోసి చంపారు.
అయితే, ఈ హత్యల్ని ఆత్మహత్యలుగా మార్చే ప్రయత్నం చేశారు. వ్యక్తి మృతదేహాన్ని చెట్లుకు వేలడదీశారు. యువతి మృతదేహాన్ని తమ ఇంటి వెనక పడేసినట్లు ఎస్పీ తెలిపారు. మహిళ కుటుంబం మొత్తం యువతి తప్పిపోయినట్లు నటించారు. గ్రామస్తులతో కలిసి ఆమెను వెతికారు. రెండు మృతదేహాలను గుర్తించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రాథమికంగా ఆత్మహత్యలుగా అనుమానించిన పోలీసులు, డెడ్బాడీలను పోస్ట్మార్టంకి తరలించారు. అయితే, రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో యువతి తండ్రి సునీల్ సాహు, ఆమె తల్లి రాందేవి సాహు, ఆమె మామ దేశరాజ్ సాహుని అరెస్ట్ చయేశారు.
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఆటో ప్రయాణం, రెస్టారెంట్.. సాధారణ వ్యక్తిలా హైదరాబాద్ చుట్టేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
Supreme Court: సుప్రీంకోర్టులోనూ మమతా బెనర్జీకి బిగ్ షాక్.. కౌంటింగ్ పిటిషన్ తిరస్కరణ
-
Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
-
Kyle Jamieson IPL Penalty: బిగ్ వార్నింగ్.. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన బౌలర్కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..
-
Axar Patel: ఎందుకు అతడిని లెజెండ్ అంటారో ఇప్పుడు అర్థమైంది.. ఆ ఆనందమే వేరప్ప!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!