UP News: న్యూ ఇయర్ రోజు ప్రేయసిని కలిసేందుకు వచ్చాడు.. ఆ తర్వాత దారుణం..
- ఉత్తర్ ప్రదేశ్లో దారుణం..
- యువతి, ఆమె ప్రేయసిని హత్య చేసిన కుటుంబం..
- ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP News: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. ప్రేమ జంటను యువతి కుటుంబీకులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన యూపీలోని లలిత్పూర్ జిల్లాలో న్యూ ఇయర్ రోజు జరిగింది. 22 ఏళ్ల వ్యక్తి, 19 ఏళ్ల యువతిని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని, ఆ తర్వాత హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని సోమవారం పోలీసులు తెలిపారు. యువతి తండ్రి, తల్లి, మామలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
చనిపోయిన వ్యక్తిని మిథున్ కుష్వాహాగా, యువతిని కామినీ సాహుగా గుర్తించారు. లలిత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జఖౌరా ప్రాంతంలోని బిఘా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ముహమ్ద్ ముస్తాక్ ప్రకారం.. వీరిద్దరు కలిసి ఉండటం యువతి కుటుంబానికి ఇష్టం లేదు. దీనిపై గతంలో పంచాయతీ జరిగింది. సాహు పెళ్లి చేసుకునే వరకు కుష్వాహా గ్రామానికి దూరంగా ఉండాలని పెద్దలు ఆదేశించారు. మిథున్ కుష్వాహా గ్రామం వెలుపల తన మామతో కలిసి ఉంటున్నాడు. అయితే, అర్థరాత్రి కామినీ సాహు ఇంటికి రహస్యంగా వెళ్లేవాడు.
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Read Also: Earthquake: హిమాలయాల్లో ఏదో రోజు విధ్వంసమే.. భూకంపాలకు కారణమేంటి..?
మిథున్ కుష్వాహా తమ కుమార్తెను రహస్యంగా కలిసేందుకు వస్తున్నాడని తెలిసింది. సాహు పుట్టిన రోజైన జనవరి 01న మళ్లీ వస్తాడని తెలుసుకుని కుటుంబం మొత్తం కలిసి హత్యలకు ప్లాన్ చేశారు. అర్థరాత్రి ఇంటికి వచ్చిన మిథున్ కుష్వాహాన కాళ్లను కట్టేసి, బలవంతంగా విషం తాగించి, ఆపై గొంతు కోసి చంపారు. దీనిపై కామినీ సాహు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆమెకు కూడా విషం తాగించి, గొంతు కోసి చంపారు.
అయితే, ఈ హత్యల్ని ఆత్మహత్యలుగా మార్చే ప్రయత్నం చేశారు. వ్యక్తి మృతదేహాన్ని చెట్లుకు వేలడదీశారు. యువతి మృతదేహాన్ని తమ ఇంటి వెనక పడేసినట్లు ఎస్పీ తెలిపారు. మహిళ కుటుంబం మొత్తం యువతి తప్పిపోయినట్లు నటించారు. గ్రామస్తులతో కలిసి ఆమెను వెతికారు. రెండు మృతదేహాలను గుర్తించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రాథమికంగా ఆత్మహత్యలుగా అనుమానించిన పోలీసులు, డెడ్బాడీలను పోస్ట్మార్టంకి తరలించారు. అయితే, రిపోర్టులో గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో యువతి తండ్రి సునీల్ సాహు, ఆమె తల్లి రాందేవి సాహు, ఆమె మామ దేశరాజ్ సాహుని అరెస్ట్ చయేశారు.
తాజావార్తలు
-
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
-
TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Kannappa: యూట్యూబ్లో విష్ణు మంచు ‘కన్నప్ప’
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..