Viral Video: తన భార్య, ఆమె ప్రియుడిని ఒక వ్యక్తి కారులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే, ఆ వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. దీంతో అతను కారు బానెట్పై పడిపోయాడు. అయినా కూడా ఆపకుండా ఒక కిలోమీటర్ వరకు ఇలాగే ఈడ్బుకుంటూ వెళ్లారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్-ఆగ్రా హైవేపై బుధవారం సాయంత్రం జరిగింది. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 31 ఏళ్ల మొహద్ సమీర్, తన భార్య నూర్ అప్షా(29)ని,…
నిన్న (జనవరి 14) మకర సంక్రాంతి పండగను పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా వచ్చిన సాధువులు తొలి పుణ్య స్నానాలు చేయగా.. తెల్లవారుజామునే 3 గంటల సమయంలో బ్రహ్మ ముహూర్తంలో పుణ్యస్నానాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్కరోజే సుమారు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
రాచకొండ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠా నుంచి మూడు తుపాకులతో పాటు 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.. బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ముఠాగా గుర్తించారు. ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నారు. హైదరాబాదులో తుపాకులు విక్రయించేందుకు ఈ ముఠా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గన్స్ కోసం ఎవరైనా ఈ ముఠాని సంప్రదించారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారా? అని ఆరా తీస్తున్నారు. ముఠా…
తెలంగాణ రాష్ట్రం బైంసా నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులోని ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడు.. కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు. సజీవ దహనం ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
Bullet Bike: చెడు సహవాసాలు ఎక్కువ అవుతున్నందనే కారణంగా తల్లిదండ్రులు బుల్లెట్ బైక్ అమ్మేయడంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ మీరట్లో ఈ ఘటన జరిగింది.
Maha Kumbh 2025: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా స్టార్ట్ అయింది. ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ప్రయాగ్రాజ్కు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. తాజాగా, వీరాంగన లక్ష్మీబాయి రైల్వే స్టేషన్లో మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలు ఎక్కడానికి ట్రై చేస్తున్న భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది.
Maha kumbh Mela: హిందువులకు అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభమేళా’’ అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ కుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా పరిగణించబడుతుంది. ఇది స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం, ఉపాధిని గణనీయంగా ప్రోత్సహిస్తుంది. ఈ కుంభమేళా ద్వారా దాదాపుగా రూ. 2…
మహాకుంభమేళా 2025 ఈరోజు నుంచి ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది. సంగం ఒడ్డుకు భక్తులు, సాధువులు, సాధువులు భారీగా తరలివచ్చారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా మహాకుంభ మొదటి 'షాహి స్నాన్' నిర్వహిస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ అరుదైన ఖగోళ యాదృచ్చికానికి సంబంధించి భక్తుల ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ మహాకుంభానికి 15 లక్షల మందికి పైగా విదేశీ పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా నేటి నుంచి ప్రారంభమైంది. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభంలో ఈసారి 40 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా. సంగం ఒడ్డున భక్తులు, సాధువులు, సాధువులు భారీగా తరలివచ్చారు. పౌష్ పూర్ణిమ సందర్భంగా మహాకుంభ మొదటి 'షాహి స్నాన్' నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.