Uttar Pradesh: 8వ తరగతి ఫెయిల్ వ్యక్తి.. హిందువుగా, ఆర్మీ అధికారిగా నమ్మిస్తూ మహిళల మోసం..
- ఆర్మీ ఆఫీసర్, హిందువుగా నమ్మిస్తూ ఘరానా మోసం..
- 20 మంది మహిళల్ని మోసం చేసిన వ్యక్తి..
- ఒక్క అనుమానంతో బయటపడిన మోసాల చిట్టా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: 8వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి, తాను ఆర్మీ కెప్టెన్ అని నమ్మిస్తూ ఏకంగా 20 మది మహిళల్ని మోసం చేశాడు. మహిళలతో రిలేషన్ పెట్టుకుని, ఆ తర్వాత డబ్బుతో ఉడాయించే వాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు చెందిన హైదర్, తనను తాను హిందువుగా, ఆర్మీ ఆఫీసర్గా పరిచయం చేసుకుని మహిళల్ని మోసం చేస్తున్నాడు. నిందితుడు 40 ఏళ్ల హైదర్ని లక్నోలో అరెస్ట్ చేశారు.
మహిళలతో సంబంధాలు పెట్టుకున్న తర్వాత పలు కారణాలు చూపుతూ, వారి దగ్గర నుంచి డబ్బులు అడిగేవాడు. ఆ తర్వాత కాంటాక్ట్లో లేకుండా పారిపోయే వాడు. వేరే ప్రాంతానికి వెళ్లి మళ్లీ మరో మహిళను నమ్మించి మోసం చేసేవాడు. ఇలా దోచుకున్న డబ్బుతో నిందితుడు విలాసవంతమైన జీవితం గడిపేవాడని పోలీసులు విచారణలో వెల్లడైంది.
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
Read Also: Daaku Maharaj : డాకు మహారాజ్లో ఆ సీన్కు సీట్లు చిరగాల్సిందేనట!
పోలీసులకు చిక్కకుండా అనేక మంది మహిళల్ని మోసం చేసిన హైదర్, ఉత్తర్ ప్రదేశ్లో లక్నోకి చెందిన ఒక మహిళ ఫిర్యాదుతో చిక్కాడు. అతడిని కలిసిన తర్వాత ఏదో అనుమానం వచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. విచారణ చేపట్టిన అధికారులకు సంచలన విషయాలు తెలిశాయి. నిందితుడు దేశంలోని పలు నగరాల్లో సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసేవాడని తేలింది. అతడు పనిచేసిన ప్రతీ నగరంలో మహిళల్ని లక్ష్యంగా చేసుకున మోసం చేసి, వారి డబ్బుతో పారిపోయే వాడు.
అనేక ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ సృష్టించి, ఆర్మీ యూనిఫాంలో ఫోటోలు పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్మీకి చెందిన పలు యూనిఫాంలు, హార్టిక్ బంగ్లో పేరుతో ఉన్న నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇతర పత్రాలనున అతడు ఉంటున్న స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హైదర్ ఆరు నెలల క్రితం మహిళ పేరుతో బైక్కు ఫైనాన్స్ చేశాడు. బైక్ని మహిళ ఇంట్లో ఉంచాడు. ఎప్పుడు వచ్చినా బైక్పై తిరుగుతుండే వాడు. హైదర్ 15 రోజుల క్రితం లక్నో వచ్చాడు. తనను ఇక్కడి కంటోన్మెంట్లో నియమించినట్లు చెప్పాడు. సైన్యం నుంచి తనకు వాహనం వచ్చిందని చెప్పాడు. బైక్పై డ్యూటీకి వెళ్లేవాడు. అతను కెప్టెన్, కమాండో అని చెప్పుకుంటున్నందుకు అతడికి తప్పకుండా ఆర్మీ వాహనం ఉండాలని మహిళ అనుమానించింది. బైక్పై డ్యూటీకి వెళ్లడం ఏంటని సందేహించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం మోసాల చిట్టా బయటకు వచ్చింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!