కొన్నిరోజులుగా అగ్రదేశం రష్యా యుద్ధం చేస్తున్న కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. రష్యా దాడుల కారణంగా ఆ దేశం భారీగా నష్టపోతోంది. దీంతో ఉక్రెయిన్కు అండగా నిలబడేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ కోసం 723 మిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీని అందించనున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. ఈ మేరకు ఆర్థిక సాయంపై ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదముద్ర వేశారు. ప్రపంచ బ్యాంకు ప్రకటించిన సాయంలో 350 మిలియన్ డాలర్లు…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల విద్యార్ధులు, పౌరులు నానా యాతన అనుభవిస్తున్నారు. ఆపరేషన్ గంగా కార్యక్రమం ద్వారా యుద్ధ ప్రాతిపదికన వేలాదిమందిని భారత్ స్వదేశాలకు తరలించింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ లోని సుమీ లో చిక్కుకుపోయున భారతీయ విద్యార్థుల తరలింపు సాధ్యంకాలేదని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి చెప్పింది భారత్. ఇప్పటికి 20 వేల మంది భారతీయులను, భారత్ ను కోరిన ఇతర దేశస్థులను కూడా తరలించామని యు.ఎన్…
కొద్ది సమయం కాల్పుల విరమణకు రష్యా సమ్మతించింది. స్థానిక కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి భారతీయ, ఇతర విదేశీయుల తరలింపునకు అంగీకరించింది రష్యా. అయితే, ఉక్రేయిన్ ఒప్పుకుంటేనే అది సాధ్యమని షరతు విధించింది. ఖార్కివ్, కివ్, మరియుపోల్, సుమీ నగరాల్లో చిక్కుకుపోయున వారిని తరలించేందుకు రష్యా అంగీకారం తెలిపింది. రష్యా ప్రతిపాదనను తిరస్కరించింది ఉక్రెయిన్. రష్యా ప్రతిపాదించిన మార్గాలన్నీ నేరుగా రష్యాకు లేదా, రష్యా మిత్ర దేశం బెలారస్ కు దారితీసేయుగా…
ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే 10 ఎయిర్ఫోర్స్ విమానాల్లో 2056 మందిని తరలించినట్టు తెలిపింది. సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ వచ్చినట్టు వివరించింది. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికి పైగా భారతీయులను సొంత దేశానికి తరలించామని వివరించింది. మంగళవారం మరో 2 విమానాలు భారత్…
ప్రపంచం ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రెండు దేశాల మధ్య శాంతి చర్యలు జరగనున్నాయి. గత రెండు విడతల చర్చలు విఫలం అయ్యాయి. పశ్చిమ దేశాల రష్యాపై ఆంక్షలు విధించడం యుద్దం ప్రకటించడం లాంటిదేనన్నారు అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. ఉక్రెయిన్ గగనతలాన్ని “నో ఫ్లై జోన్” గా ప్రకటించే ప్రయత్నం…
ఉక్రెయిన్పై భీకర దాడులు కొనసాగిస్తోంది రష్యా.. ఇరు దేశాల మధ్య యుద్ధం పదో రోజుకు చేరుకోగా… రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత తన విశ్వరూపాన్ని చూపిస్తూ.. విరుచుకుపడుతున్నాయి పుతిన్ సేనలు.. అయితే, యుద్ధంలో ఇప్పటి వరకు 10,000 మంది రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 10వ రోజులోకి ప్రవేశించిగా.. 10,000 మంది రష్యన్ సైనికులు మరణించారని పేర్కొన్నారు జెలెన్స్కీ… అయితే, ఉక్రెయిన్ తన సాయుధ బలగాల మరణాల గణాంకాలను…
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. భీకర దాడులు 10వ రోజుకు చేరుకున్నాయి.. అయితే, సుమారు ఐదు గంటలపాటు తాత్కాలికంగా విరమించుకున్న రష్యా.. మళ్లీ కాల్పులతో విరుచుకుపడుతోంది.. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల నుంచి అయిదున్నర గంటల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా.. ఆ తర్వాత మళ్లీ యుద్ధం మొదలైంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు కొనసాగిస్తోంది.. ఉక్రెయిన్లోని పోర్టు సిటీ మారియుపోల్, వోల్నావోఖా నగరాలపై క్షిపణులతో విరుచుకుపడ్డాయి…
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ప్రపంచవ్యాప్తంగా సంక్షోభానికి కారణం అవుతున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి చర్చలు జరపాలని ఇరుదేశాలను ప్రపంచం కోరుతోంది. దీంతో ఈ వారాంతంలో మరోసారి రష్యాతో శాంతి చర్చలు జరపాలనే ఆలోచనలో వుంది ఉక్రెయిన్. రష్యా దాడుల్లో ఇప్పటివరకు 331 మంది పౌరులు మృతి చెందగా 685 మందికి గాయాలయ్యాయి. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చంటున్నారు. ఖేర్సన్ కు దక్షిణ ప్రాంతాలన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఓజోవ్ సముద్ర…
ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వైద్యవిద్యను అభ్యసించే భారతీయ విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. యుద్ధంతో అతలాకుతలం అవుతున్న దేశం నుంచి బయటపడాలని వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. వీరిని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అపరేషన్ గంగా నిర్వహిస్తోంది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లి తిరిగొచ్చిన విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ఎంసీ నిబంధనలు సడలించింది. ఇప్పటికే కొన్ని వేలమంది మెడిసిన్ చదువుతోన్న విద్యార్థులు భారత్లోని…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులు, విద్యార్ధులను తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. సుమారు 2 వేల నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధ జోన్లలో ఉండొచ్చని అంచనా వేసింది విదేశాంగ శాఖ. ఇదిలా వుంటే.. ఉక్రెయిన్ నుంచి రాష్ట్ర విద్యార్థుల తరలింపుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు రాష్ట్ర ప్రతినిధుల్ని పంపిస్తోంది. హంగేరీలోని బుడాపెస్ట్ కు చేరుకున్నారు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్…