Operation Ganga: చివరి దశకు ఆపరేషన్ గంగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వరకు 73 విమానాల్లో 15,206 మందిని భారత్ తీసుకొచ్చినట్టు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే 10 ఎయిర్ఫోర్స్ విమానాల్లో 2056 మందిని తరలించినట్టు తెలిపింది. సోమవారం 7 విమానాల్లో 1314 మంది భారత్ వచ్చినట్టు వివరించింది. మొత్తంగా ఫిబ్రవరి 22న ఆపరేషన్ గంగ మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి 17,400 మందికి పైగా భారతీయులను సొంత దేశానికి తరలించామని వివరించింది. మంగళవారం మరో 2 విమానాలు భారత్ రానున్నాయి. దీంతో, ఆపరేషన్ గంగ దాదాపు చివరి దశకు చేరినట్టు అయ్యింది.. అయితే మరో రెండు వేల మంది వరకు రొమేనియా, స్లొవేకియా, మాల్డోవా దేశాల్లో భారత్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది.
Read Also: Women’s Day 2022: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.. మానవ జాతికి మహిళ ఒక వరం
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
హంగెరీ నుంచి తరలింపు ముగిసింది. లాస్ట్ బ్యాచ్ తో భారత్ వచ్చేశారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి. అలాగే ఉక్రెయిన్ లోని వార్జోన్ గా ఉన్న సుమీ సిటీలోనూ దాదాపు 600 మంది భారతీయులు ఉన్నట్టు ప్రకటించింది. వారిని కూడా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉక్రెయిన్లో పరిస్థితులను, రష్యా సైన్యాన్ని కౌంటర్ చేస్తున్న విధానాన్ని మోడీకి వివరించారు జెలెన్స్కీ. భారతీయుల తరలింపునకు సహకరిస్తున్నందకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు మోడీ. 50 నిమిషాల పాటు వీరి మధ్య చర్చ జరిగింది. ఉక్రెయిన్-రష్యా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన అంశాలను మోడీకి వివరించారు పుతిన్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నేరుగా మాట్లాడాలని పుతిన్ కు విజ్ఞప్తి చేశారు మోడీ. సుమీ నుంచి భారతీయులందరినీ సురక్షితంగా తరలించడం తమకు ప్రాధాన్యమని మోడీ చెప్పారు. భారతీయులను తరలించే విషయంలో అవసరమైన సహకారం అందిస్తామని పుతిన్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!