ఉక్రెయిన్ లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వైద్యవిద్యను అభ్యసించే భారతీయ విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. యుద్ధంతో అతలాకుతలం అవుతున్న దేశం నుంచి బయటపడాలని వారు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. వీరిని తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం అపరేషన్ గంగా నిర్వహిస్తోంది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువు కోసం వెళ్లి తిరిగొచ్చిన విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎన్ఎంసీ నిబంధనలు సడలించింది. ఇప్పటికే కొన్ని వేలమంది మెడిసిన్ చదువుతోన్న విద్యార్థులు భారత్లోని…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులు, విద్యార్ధులను తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. సుమారు 2 వేల నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధ జోన్లలో ఉండొచ్చని అంచనా వేసింది విదేశాంగ శాఖ. ఇదిలా వుంటే.. ఉక్రెయిన్ నుంచి రాష్ట్ర విద్యార్థుల తరలింపుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు రాష్ట్ర ప్రతినిధుల్ని పంపిస్తోంది. హంగేరీలోని బుడాపెస్ట్ కు చేరుకున్నారు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్…
ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దురాక్రమణ పరాకాష్టకు చేరుతోంది. పుతిన్ అరాచకానికి సైనికులతో పాటు సామాన్య పౌరులు బలైపోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హతమార్చేందుకు రెక్కీల మీద రెక్కీలు సాగుతున్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. సైనిక చర్య మొదలైన వారం రోజుల్లోనే ఆయన హత్యకు మూడుసార్లు యత్నించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతోన్న భద్రతా దళాలు రష్యా కుట్రను భగ్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని కడతేర్చేందుకు వందలాది మంది ప్రైవేటు సైన్యం కీవ్లో ప్రవేశించిందని వారం…
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది… రష్యా దాడులు తీవ్రతరం చేసినా.. ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడికి దిగుతోంది.. యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టమే దీనికి ఉదాహరణ.. ఇక, రష్యా ఓవైపు దాడులు చేస్తున్నా.. మరోవైపు, దేశాన్ని వీడేది లేదు.. ఇక్కడే ఉంటాం.. దేశాన్ని కాపాడుకుంటాం.. మాకు ఆయుధాలు కావాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ.. ఉక్రెయిన్లలో ధైర్యాన్ని నింపుతూ వస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. అయితే, జెలెన్స్కీపై రష్యా మీడియా తాజాగా ప్రసారం…
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు. అయితే రష్యా దురాక్రమణ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులు, కుటుంబాల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మాత్రం సుప్రీంకోర్టు ప్రశంసించింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మంచి చర్యలే చేపడుతోందని, దానిపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని సీజేఐ ఎన్వీ రమణ తేల్చి చెప్పారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తిగానే ఉన్నాయని…
ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. మరోవైపు భీకర దాడులకు పాల్పడుతోంది… ఇక, అదే స్థాయిలో ఉక్రెయిన్ నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది రష్యా బలగాలకు.. ఇరు దేశాలకు చెందిన సైనికులతో పాటు.. ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు.. కేవలం సైనికులే కాదు.. కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోవడం రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ ఉక్రెయిన్లో విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది.. యుద్ధం మొదట్లో…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది… ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, ఖర్వివ్పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్పై గత 8 రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. జనావాసాలను కూడా రాకెట్లు, క్షిపణులతో విధ్వంసం చేస్తోంది.. మరోవైపు రష్యా అణు జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది. బారెంట్స్ జలాల్లోకి అణు జలాంతర్గాములను తరలిస్తోంది. ఇప్పటికే ఖెర్సాన్, బెర్డ్యాన్స్ ఓడరేవులను స్వాధీనం చేసుకున్న రష్యా.. ఒడెస్సా, మరియూపూల్ స్వాధీనం చేసుకోవడానికి ముందుకు కదులుతోంది.. ఇక, యుద్ధంపై కీలక…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రభావం అన్నింటా పడుతోంది. ఇప్పటికి ఇంకా 8 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రత్యేకంగా C-17 లాంటి భారీ రవాణా విమానాల్లో రుమేనియా, పోలండ్, హంగేరీల నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. రష్యా సేనల అధీనంలో ఉక్రెయిన్ లోని “ఖేర్సన్” పట్టణ కేంద్రం వుంది.…
ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై వివరణ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్యార్థులు బందీలుగా ఉండటంపై మాకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఉక్రెయిన్లోని ఇండియా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది విదేశాంగ…
ఉక్రెయిన్-రష్యా యుద్ధ జరుగుతోన్న సమయంలో ఇప్పటికే ఓ భారత విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. పంజాబ్కు చెందిన చందన్ జిందాల్ అనే 22 ఏళ్ల మెడికల్ విద్యార్థి మృతిచెందాడు… అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్టు చెబుతున్నారు.. రక్త గడ్డ కట్టడంతో చందన్ జిందాల్ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్కారణంగా అతడు మృతిచెందినట్టు జాతీయ మీడియా పేర్కొంది.. ఉక్రెయిన్…