Operation Ganga: పోలాండ్కు విద్యార్థులు.. రేపు భారత్కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేసి.. తాను నాటోలో చేరబోను.. యుద్ధం ఆపండి.. అంటూ విజ్ఞప్తి చేసినా.. ఇంకా.. రష్యా మాత్రం యుద్ధం ఆపలేదు.. మరోవైపు.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా రేపు ఇండియాకు చివరి విమానాలు రాబోతున్నాయి.. సుమీలో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు.. సుమీ నుంచి 694 మందిని ఇప్పటికే పోలాండ్ కు తరలించారు.. ల్వీవ్ రైల్వే స్టేషన్ వద్ద భారత రాయబారి వీరికి వీడ్కోలు పలికారు. విద్యార్థులంతా రేపు భారత్కు బయల్దేరే అవకాశం ఉందని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రేపు పోలాండ్ నుండి భారత్కు రానుంది అని చెబుతున్నారు..
Read Also: KRMB: రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక భేటీ
Also Read
- 1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
- Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
- Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
- Pakistan: పాకిస్థాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 40 మంది మృతి
మరోవైపు, రష్యా- ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. చర్చల్లో కాస్త పురోగతి లభించిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని స్పష్టం చేసింది రష్యా.. ఇక, రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇతర దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతలు, ఆంక్షలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది రష్యా. మరోవైపు రష్యాలో విదేశీ కరెన్సీ విత్డ్రాపై ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాత్కాలిక పరిమితులు విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆ ఆంక్షలు ఉంటాయని వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన నేపథ్యంలో.. రష్యా ముందుకు వచ్చి యుద్ధం ఆపేస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సిన అంశం. ఇక, ఆపరేషన్ గంగాతో ఇప్పటి వరకు 18 వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి చేర్చింది భారత ప్రభుత్వం.
తాజావార్తలు
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!