Operation Ganga: పోలాండ్కు విద్యార్థులు.. రేపు భారత్కు తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ అధ్యక్షుడు చేతులెత్తేసి.. తాను నాటోలో చేరబోను.. యుద్ధం ఆపండి.. అంటూ విజ్ఞప్తి చేసినా.. ఇంకా.. రష్యా మాత్రం యుద్ధం ఆపలేదు.. మరోవైపు.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపు కోసం చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా రేపు ఇండియాకు చివరి విమానాలు రాబోతున్నాయి.. సుమీలో చిక్కుకున్న భారతీయులను తరలింపు ప్రక్రియ పూర్తి చేశారు.. సుమీ నుంచి 694 మందిని ఇప్పటికే పోలాండ్ కు తరలించారు.. ల్వీవ్ రైల్వే స్టేషన్ వద్ద భారత రాయబారి వీరికి వీడ్కోలు పలికారు. విద్యార్థులంతా రేపు భారత్కు బయల్దేరే అవకాశం ఉందని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. రేపు పోలాండ్ నుండి భారత్కు రానుంది అని చెబుతున్నారు..
Read Also: KRMB: రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక భేటీ
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
మరోవైపు, రష్యా- ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న శాంతి చర్చలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. చర్చల్లో కాస్త పురోగతి లభించిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని స్పష్టం చేసింది రష్యా.. ఇక, రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇతర దేశాల నుంచి వస్తున్న వ్యతిరేకతలు, ఆంక్షలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తోంది రష్యా. మరోవైపు రష్యాలో విదేశీ కరెన్సీ విత్డ్రాపై ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ తాత్కాలిక పరిమితులు విధించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆ ఆంక్షలు ఉంటాయని వెల్లడించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన నేపథ్యంలో.. రష్యా ముందుకు వచ్చి యుద్ధం ఆపేస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సిన అంశం. ఇక, ఆపరేషన్ గంగాతో ఇప్పటి వరకు 18 వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి చేర్చింది భారత ప్రభుత్వం.
తాజావార్తలు
-
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!