ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దురాక్రమణ పరాకాష్టకు చేరుతోంది. పుతిన్ అరాచకానికి సైనికులతో పాటు సామాన్య పౌరులు బలైపోతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హతమార్చేందుకు రెక్కీల మీద రెక్కీలు సాగుతున్నాయనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. సైనిక చర్య మొదలైన వారం రోజుల్లోనే ఆయన హత్యకు మూడుసార్లు యత్నించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతోన్న భద్రతా దళాలు రష్యా కుట్రను భగ్నం చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిని కడతేర్చేందుకు వందలాది మంది ప్రైవేటు సైన్యం కీవ్లో ప్రవేశించిందని వారం…
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్కు తరలించినట్లు…
ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది… రష్యా దాడులు తీవ్రతరం చేసినా.. ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురుదాడికి దిగుతోంది.. యుద్ధంలో రష్యాకు జరిగిన నష్టమే దీనికి ఉదాహరణ.. ఇక, రష్యా ఓవైపు దాడులు చేస్తున్నా.. మరోవైపు, దేశాన్ని వీడేది లేదు.. ఇక్కడే ఉంటాం.. దేశాన్ని కాపాడుకుంటాం.. మాకు ఆయుధాలు కావాలంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ.. ఉక్రెయిన్లలో ధైర్యాన్ని నింపుతూ వస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. అయితే, జెలెన్స్కీపై రష్యా మీడియా తాజాగా ప్రసారం…
ఉక్రెయిన్-రష్యా వార్ ఉధృతంగా సాగుతోంది.. మరోవైపు శాంతి చర్చలకు కూడా సిద్ధం అవుతున్నారు.. మొదటి విడత చర్చలు విఫలం కావడంతో.. బెలారస్లో రెండవ విడత శాంతి చర్చల కోసం ప్రతినిధులను పంపామని చెబుతోంది రష్యా.. అయితే, రష్యా చర్చలు జరపాలనుకుంటే వెంటనే దాడులు ఆపాలని డిమాండ్ చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. దీంతో, చర్చలు ఉంటాయా? లేదా? అనేది ప్రశ్నగా మారింది.. మరోవైపు, రష్యా దాడులు మొదలైన తర్వాత 9 లక్షల మందికి పైగా ప్రజలు…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో.. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులు, విద్యార్థుల తరలింపును వేగవంతం చేసింది భారత ప్రభుత్వం.. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దింపింది.. ఇక, మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోడీ.. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించాలని, విద్యార్థుల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని.. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.. దీంతో, ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు…
ఉక్రెయిన్-రష్యా యుద్ధ జరుగుతోన్న సమయంలో ఇప్పటికే ఓ భారత విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. పంజాబ్కు చెందిన చందన్ జిందాల్ అనే 22 ఏళ్ల మెడికల్ విద్యార్థి మృతిచెందాడు… అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్టు చెబుతున్నారు.. రక్త గడ్డ కట్టడంతో చందన్ జిందాల్ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్కారణంగా అతడు మృతిచెందినట్టు జాతీయ మీడియా పేర్కొంది.. ఉక్రెయిన్…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో.. ఉక్రెయిన్లోని చిక్కుకుపోయిన భారతీయ కోసం కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ఖార్కివ్లోని భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.. యుద్ధభూమి ఖార్కివ్ను తక్షణం వీడాలని స్పష్టం చేసింది ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం.. ఖార్కివ్లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఈ కీలక సూచనలు చేసింది.. నగర శివార్లలోని పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లాలని…
ఉక్రెయిన్పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా దేశంలోని ఇతర పెద్ద నగరాలపై దాడులను తీవ్రతరం చేశాయి రష్యా బలగాలు.. రాజధాని కీవ్ సిటీపై పట్టు సాధించేందుకు రష్యా ప్రయత్నం చేస్తోంది.. ఇతర నగరాలను హస్తగతం చేసుకుంటోంది. తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని అతిపెద్ద సిటీ అయిన ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా పాలమిలటరీ బలగాలు ఖేర్సన్లో బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఉక్రెయిన్ సైనికులతో పాటు, పౌరులు…
ఉక్రెయిన్ – రష్యా మధ్య భీకర పోరు సాగుతోంది.. రష్యా బలగాలకు ఉక్రెయిన్ ఆర్మీ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది… యుద్ధంలో చనిపోయే ఉక్రెయిన్ల కంటే.. రష్యా సైనికుల సంఖ్యే భారీగా ఉంటుంది… గత 6 రోజుల్లో ఆరు వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.. ఉక్రెయిన్పై రష్యా దాడి ఏడో రోజుకు చేరుకుంది.. ఇప్పటి వరకు కనీసం 14 మంది పిల్లలతో సహా 300 మందికి పైగా పౌరులు మరణించారని…
ఉక్రెయిన్పై రష్యా భీకర రీతిలో యుద్ధం చేస్తోంది. ఈ కారణంగా ఉక్రెయిన్లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులందరూ స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కొంతమంది భారతీయులు ఇంకా అక్కడే చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు సురక్షితంగా తిరిగొస్తాడో, లేదో అనే ఒత్తిడిని తట్టుకోలేక ఓ తల్లి ప్రాణం విడిచింది. తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన శక్తివేల్ ఉక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. ఉక్రెయిన్పై రష్యా దాడి…