Ukraine Russia War: వార్ జోన్లలో 3 వేల మంది భారత విద్యార్థులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్కు తరలించినట్లు కేంద్రం వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దుల తరలివస్తున్న భారతీయులను తరలించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది.
ఇక, యుద్ధం జరుగుతున్న జోన్లలో ఇప్పటికీ కనీసం వెయ్యి మంది భారతీయులున్నారని చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తూర్పు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న ఖార్కైవ్లో 300 మంది, సుమీలో 700 మంది భారతీయులున్నారని.. సుమారు 2 నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధ జోన్లలో ఉండచ్చని అంచనా వేసింది కేంద్రం. సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటారని.. గత 24 గంటల్లో మొత్తం 15 విమానాల్లో మూడు వేల మంది భారతీయులును స్వదేశానికి తరలించామని తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను వచ్చే 24 గంటల్లో మరొక 16 విమానాల్లో తీసుకొస్తున్నాం. “ఆపరేషన్ గంగా” కార్యక్రమం కింద మొత్తం 48 విమానాల్లో 10,300 మంది భారతీయ విద్యార్థులను తరలించామని వెల్లడించారు..సుమీ విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో సుమారు 800-900 మంది భారతీయ విద్యార్థులున్నారు. చాలినంత ఆహారం, తాగటానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ నుంచి తరలించాలని కోరుతున్నారు. చిక్కుకుపోయున భారతీయ విద్సార్దులను తరలించేందుకు కాల్పుల విరమణ సహాయ పడుతుందని.. విద్యార్థులను తరలించేందుకు, సురక్షిత మార్గాన్ని చూపాలని రెండు దేశాలను విజ్ఞప్తి చేశామని కేంద్రం చెబుతోంది.
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
తాజావార్తలు
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
-
KTR : కాంగ్రెస్ హయాంలో కరెంట్ లేదు.. నీళ్లు లేవు.. కేటీఆర్ ఫైర్.!
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!