Ukraine Russia War: వార్ జోన్లలో 3 వేల మంది భారత విద్యార్థులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగాను మరింత వేగవంతం చేసింది. ఇవాళ ఒక్కరోజే 8 వేల మందిని తరలించినట్లు కేంద్రం తెలిపింది. చివరి 24 గంటల్లో 18 విమానాల్లో 8 వేల మందిని భారత్కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరో 24 గంటల్లో 16 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసి భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ విమానాల్లోనే 10 వేల 344 మందిని భారత్కు తరలించినట్లు కేంద్రం వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దుల తరలివస్తున్న భారతీయులను తరలించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు విదేశాంగశాఖ తెలిపింది.
ఇక, యుద్ధం జరుగుతున్న జోన్లలో ఇప్పటికీ కనీసం వెయ్యి మంది భారతీయులున్నారని చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తూర్పు ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న ఖార్కైవ్లో 300 మంది, సుమీలో 700 మంది భారతీయులున్నారని.. సుమారు 2 నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధ జోన్లలో ఉండచ్చని అంచనా వేసింది కేంద్రం. సుమారు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటారని.. గత 24 గంటల్లో మొత్తం 15 విమానాల్లో మూడు వేల మంది భారతీయులును స్వదేశానికి తరలించామని తెలిపారు. చిక్కుకుపోయున భారతీయులను వచ్చే 24 గంటల్లో మరొక 16 విమానాల్లో తీసుకొస్తున్నాం. “ఆపరేషన్ గంగా” కార్యక్రమం కింద మొత్తం 48 విమానాల్లో 10,300 మంది భారతీయ విద్యార్థులను తరలించామని వెల్లడించారు..సుమీ విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో సుమారు 800-900 మంది భారతీయ విద్యార్థులున్నారు. చాలినంత ఆహారం, తాగటానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ నుంచి తరలించాలని కోరుతున్నారు. చిక్కుకుపోయున భారతీయ విద్సార్దులను తరలించేందుకు కాల్పుల విరమణ సహాయ పడుతుందని.. విద్యార్థులను తరలించేందుకు, సురక్షిత మార్గాన్ని చూపాలని రెండు దేశాలను విజ్ఞప్తి చేశామని కేంద్రం చెబుతోంది.
Also Read
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
తాజావార్తలు
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!