Ukraine Russia War: ఖార్కివ్ అత్యవసరంగా ఖాళీ చేయండి.. భారతీయులకు కేంద్రం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో.. ఉక్రెయిన్లోని చిక్కుకుపోయిన భారతీయ కోసం కీలక ఆదేశాలు జారీ చేసింది భారత ప్రభుత్వం.. ఖార్కివ్లోని భారతీయులకు కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.. యుద్ధభూమి ఖార్కివ్ను తక్షణం వీడాలని స్పష్టం చేసింది ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం.. ఖార్కివ్లోని భారతీయులకు ఇండియన్ ఎంబసీ ఈ కీలక సూచనలు చేసింది.. నగర శివార్లలోని పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లాలని పేర్కొంది.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు చేరుకోవాలని వెల్లడించింది.. మొత్తంగా నాలుగు గంటల్లో ఖార్కివ్ను భారతీయులు ఖాళీ చేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Ukraine Russia War: మూడో ప్రపంచ యుద్ధం వస్తే అణు విధ్వంసమే..!
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
కాగా, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో ఉక్రెయిన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, భారత పౌరులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు.. ప్రాణాలను పణంగా పెట్టి, భారతీయ విద్యార్థులు జాతీయ జెండా పట్టుకుని ఖార్కివ్లో గుంపులుగా నడుస్తూ.. రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.. 700 మంది భారతీయులతో సహా 1,000 మంది భారతీయ జెండాను పట్టుకుని రైల్వే స్టేషన్ నడుస్తూ వెళ్లారు.. వాహనాలు అందుబాటులో లేకపోవడంతో కాలినడకన ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వేస్టేషన్కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. భారతదేశం నుండి విద్యార్థులు మరియు కార్మికులు, ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు బుధవారం నాడు యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్లోని ఖార్కివ్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత జాతీయ జెండాను పట్టుకుని సమీప రైల్వే స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఒక విద్యార్థి తండ్రి తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
-
Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
-
తెలంగాణ జలియన్వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!