మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు నెలలకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహారాష్ట్రలో అత్యధిక లోక్సభ సీట్లను సొంతం చేసుకుంది. 48 లోక్సభ స్థానాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాకరే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది.
Maharashtra Election Results: మహారాష్ట్రలో అత్యంత ప్రాధాన్యమున్న పోరులో దక్షిణ ముంబైలోని వర్లీ ఒకటి. ఈ స్థానం నుంచి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీలో వెనకంజలో ఉన్నారు. శిండే శివసేన నే మిలింద్ దేవరా ఆధిత్యంలో ఉన్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ఠాక్రే కన్నా కేవలం 600 ఓట్ల మెజారిటీలో దేవరా కొనసాగుతన్నారు. ఇప్పటి వరకు 17 రౌండ్స్లో 5 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి.
Shiv Sena: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి సత్తాచాటుతోంది. బీజేపీ+శివసేన(షిండే)+ ఎన్సీపీ(అజిత్ పవార్)ల ‘‘మహయుతి’’ కూటమి సంచలన విజయం సాధిస్తోంది. మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి ఏకంగా 219 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్+ఠాక్రే సేన+శరద్ పవార్ ఎన్సీపీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి కేవలం 55 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
BJP: ముంబైలోనివి ప్రాజెక్టుపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అబద్ధాలను బట్టబయటు చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ రోజు ఎక్స్లో పోస్ట్ చేశారు. పవార్ వ్యాఖ్యలు ‘‘ ముంబై, మహారాష్ట్రలను తప్పుదోవ పట్టించడానికి ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.’
Uddhav Thackeray: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం చెప్పారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యల్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు ఎక్కుపెడుతోంది.
Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలు ముంబైలోని ధారావి స్లమ్ ఏరియా చుట్టూ తిరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావి ప్రాజెక్టు రద్దు చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దీంతో ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల కోసం తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, ధారావి ప్రాజెక్టు ముంబయిపై ప్రభావం చూపుతుందని, తాను అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని థాకరే నిన్న చెప్పారు.
Uddhav Thackeray: బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బావాన్కులే, శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ ఠాక్రేని ఒత్తిడి చేసింది, తమతో ఉన్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొంది. హర్యానాలో ఘన విజయం సాధించిన బీజేపీ, మరోసారి మహారాష్ట్రలో కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి( బీజేపీ-ఎన్సీపీ అజిత్ పవార్- శివసేన ఏక్నాథ్ షిండే), మరోవైపు ‘మహా వికాస్ అఘాడీ’( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఉద్ధవ్ ఠాక్రే) కూటమి పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ దెబ్బ పడింది. ఆ పార్టీ నుంచి టికెట్ పొందిన అభ్యర్థి, తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పాడు. శివసేన-యూటీటీ నుంచి ఔరంగాబాద్లో పోటీ చేయడానికి టికెట్ పొందిన అభ్యర్థి కిషన్ చంద్ తన్వానీ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలకు దాదాపుగా ఒక నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఆ రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో మహా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’లో ఇంకా పొత్తులు కన్ఫామ్ కాలేదు. శివసేన ఠాక్రే వర్గానికి, కాంగ్రెస్కి మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.