Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..
- యోగి వ్యాఖ్యల్ని వ్యతిరేకించిన అజిత్ పవార్..
- బీజేపీ కూటమిలో ఐక్యత లేదని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం చెప్పారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యల్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు ఎక్కుపెడుతోంది. బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’లో ఐక్యత లేదని ఈ వ్యాఖ్యలే నిదర్శనమని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కొద్ది నెలల క్రితం సింధుదుర్గ్లో కూలిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఘటనను ప్రస్తావిస్తూ.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైందిగా ఆరోపించారు.
Read Also: Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
బుల్దానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘యోగి వ్యాఖ్యల్ని అజిత్ పవార్ అంగీకరించకపోవడం, ఆ కూటమిలో ఐక్యత లేదని తెలియజేస్తోంది. యూపీ ముఖ్యమంత్రి నుంచి మహారాష్ట్ర ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో యోగి ‘‘బాటేంగేతో కటేంగే’’ నినాదాన్ని తీసుకువచ్చారు. అయితే, ఈ నినాదంపై అజిత్ పవార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలు ఇలాంటి వ్యాఖ్యల్ని హర్షించరని, రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ మత సామరస్యాన్ని కొనసాగించడానికి కృషి చేస్తున్నారని అన్నారు.
ఎన్నికల ముందు ప్రచారానికి రాష్ట్రం బయట నుంచి నేతల్ని తీసుకురావడంపై బీజేపీపై ఠాక్రే మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రేమించే వారికి, ద్వేషించే వారికి మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతీ జిల్లాలో శివాజీ మహరాజ్ ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. మహిళల్ని ఎలా గౌరవించాలనే బోధనల్ని హైలెట్ చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!