Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..
- యోగి వ్యాఖ్యల్ని వ్యతిరేకించిన అజిత్ పవార్..
- బీజేపీ కూటమిలో ఐక్యత లేదని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం చెప్పారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యల్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు ఎక్కుపెడుతోంది. బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’లో ఐక్యత లేదని ఈ వ్యాఖ్యలే నిదర్శనమని శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కొద్ది నెలల క్రితం సింధుదుర్గ్లో కూలిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహ ఘటనను ప్రస్తావిస్తూ.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైందిగా ఆరోపించారు.
Read Also: Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
బుల్దానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘యోగి వ్యాఖ్యల్ని అజిత్ పవార్ అంగీకరించకపోవడం, ఆ కూటమిలో ఐక్యత లేదని తెలియజేస్తోంది. యూపీ ముఖ్యమంత్రి నుంచి మహారాష్ట్ర ఎలాంటి గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో యోగి ‘‘బాటేంగేతో కటేంగే’’ నినాదాన్ని తీసుకువచ్చారు. అయితే, ఈ నినాదంపై అజిత్ పవార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలు ఇలాంటి వ్యాఖ్యల్ని హర్షించరని, రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ మత సామరస్యాన్ని కొనసాగించడానికి కృషి చేస్తున్నారని అన్నారు.
ఎన్నికల ముందు ప్రచారానికి రాష్ట్రం బయట నుంచి నేతల్ని తీసుకురావడంపై బీజేపీపై ఠాక్రే మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రేమించే వారికి, ద్వేషించే వారికి మధ్య జరిగే పోరుగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంవీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతీ జిల్లాలో శివాజీ మహరాజ్ ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. మహిళల్ని ఎలా గౌరవించాలనే బోధనల్ని హైలెట్ చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!