Uddhav Thackeray: ‘‘మాతో ఉన్నప్పుడు చాలా సీట్లు ఇచ్చాం’’.. ఉద్ధవ్ పరిస్థితిపై బీజేపీ..
- మాతో ఉన్నప్పుడు ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ సీట్లు వచ్చాయి..
- కాంగ్రెస్ పొత్తులో తక్కువ సీట్లు పొందాడు..
- బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావాన్కులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బావాన్కులే, శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ ఠాక్రేని ఒత్తిడి చేసింది, తమతో ఉన్న సమయంలో ఉద్ధవ్ ఠాక్రేకి ఎక్కువ సీట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలో ఆయనకు 100 సీట్ల కన్నా ఎక్కువ వచ్చాయని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీ ఎల్లప్పుడుూ మాతోశ్రీ(ఉద్ధవ్ ఠాక్రే నివాసం పేరు) దాని వారసత్వాన్ని గౌరవిస్తుందని చెప్పారు. ఇప్పుడు ఠాక్రే అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కాంగ్రెస్ తన రెబల్స్ని దించిందని ఆరోపించారు.
కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన బవాన్కులే.. కాంగ్రెస్ ఎప్పుడూ ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందని అన్నారు. ముస్లింల ఓటు బ్యాంక్ పార్టీ కాంగ్రెస్ అని, వారిని ఎప్పటికప్పుడూ పారద్రోలాలని, ముస్లిం సమాజాన్ని తమవైపు తప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని బవాన్కులే అన్నారు.
Also Read
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
Read Also: West Bengal: దుర్గాపూజా మండపాలపై దాడులు.. డీజీపీ నుంచి నివేదిక కోరిన హైకోర్టు..
‘‘బీజేపీ ప్రభుత్వం ఎక్కడ అమలులో ఉన్నా మహిళలకు, పేదలకు సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి కానీ కాంగ్రెస్ వారు పాలించిన రాష్ట్రాల్లో తమ పథకాన్ని నిలిపివేశారు. ఎన్నికల అనంతరం లడ్కీ బహిన్ పథకాన్ని నిలిపివేస్తామని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా చెబుతున్నా, వచ్చే 5 ఏళ్ల పాటు ఈ స్కీమ్ కొనసాగుతుంది’’ అని బవాన్కులే చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి(బీజేపీ- శివసేన షిండే-ఎన్సీపీ అజిత్ పవార్) కూటమి, మహా వికాస్ అఘాడీ( కాంగ్రెస్- ఠాక్రే శివసేన- ఎన్సీపీ శరద్ పవార్) కూటమి పోటీలో ఉన్నాయి. నవంబర్ 20న రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతుండగా.. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!