Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..
- కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే ఓడిపోయాం..
- హస్తం తీరుపై ఠాక్రే సేన విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీల ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ కూటమి దారుణంగా ఓడిపోయింది. 288 స్థానాల్లో బీజేపీ కూటమి 233 సీట్లను సాధిస్తే, ఎంవీఏ 49 సీట్లకే పరిమితమైంది. ఈ పరిణామం ఎంవీఏ కూటమిలో విభేదాలకు కారణమైంది. తాజాగా ఎంవీఏ కూటమి ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రిగా భావించి ఉండాల్సిందని మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే అన్నారు.
Read Also: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
Also Read
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇది ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో దాని వైఖరి మమ్మల్ని బాధించింది. ఉద్దవ్ ఠాక్రేని సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. ఇలా చేసి ఉంటే ఫలితాలు భిన్నంగా ఉండేవి’’ అని దాన్వే అన్నారు.
ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలలో సమయంలో కూడా శివసేన ఠాక్రే వర్గం, కాంగ్రెస్కి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. సంజయ్ రౌత్, కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానాపటోలేని బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 స్థానాల్లోనే గెలుపొందింది. 89 సీట్లలో పోటీ చేసిన శివసేన ఠాక్రే వర్గం 20 స్థానాలను గెలుచుకుంది. 87 స్థానాల్లో పోటీ చేసిన ఎన్సీపీ శరద్ పవార్ కేవలం 10 అసెంబ్లీల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 288 స్థానాల్లో పోటీ చేసే స్థాయికి ఠాక్రే సేన తన బలాన్ని పెంచుకోవడానికి సిద్ధమవుతుందని దాన్వే చెప్పారు. ఏక్నాథ్ షిండే వల్ల శివసేన చీలిపోయిందని, బీజేపీకి చాలా రాష్ట్రాల్లో షిండేలు ఉన్నారని, వారిని బీజేపీ వాడుకుని పారేస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!