INDIA Bloc: 6 నెలల్లో ఎంత మార్పు.. లోక్సభలో అదుర్స్.. అసెంబ్లీలో తుస్!
- 6 నెలల్లో ఇండియా కూటమిపై ఎంత మార్పు
- లోక్సభలో మెరుపులు.. అసెంబ్లీలో తుస్!
- మహారాష్ట్రలో 54 సీట్లకే పరిమితమైన కూటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు నెలలకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహారాష్ట్రలో అత్యధిక లోక్సభ సీట్లను సొంతం చేసుకుంది. 48 లోక్సభ స్థానాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాకరే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమికి గట్టి షాకిచ్చింది. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక బూస్టింగ్లాంటిదని కూటమి భావించింది. అధికారం కోసం ఎన్నో కలలు కంది. లోక్సభలో వచ్చిన ఉత్సాహమే.. అసెంబ్లీలో కూడా అదే తరహాలో ఉంటుంది అని కాంగ్రెస్ కూటమి భావించింది. తీరా ఆరు నెలలు తిరిగేసరికి అంతా తుస్మని పోయింది. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో బొమ్మ.. బొరుసైంది. మహా వికాస్ అఘాడీ కూటమి భారీ ఓటమిని కూడగట్టుకుంది. 288 స్థానాలు ఉండగా కేవలం 54 స్థానాలతో ఇండియా కూటమి సరిపెట్టుకుంది. ఇక మహాయుతి కూటమి(ఎన్డీఏ) ఏకంగా 227 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Ajay Dhishan: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. కానీ విలన్ గా?
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పండితులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఆరు నెలల్లో ప్రజల్లో ఎంత మార్పు అంటూ సంభాషించుకుంటున్నారు. గరిష్ట స్థాయి నుంచి కనిష్ట స్థాయికి ఇండియా కూటమి పడిపోయిందని గుసగుసలాడుకుంటున్నారు. ఇక శరద్పవార్(83) ఇప్పటికే రాజకీయాలకు గుడ్బై చెప్పారు. 2026లో శరద్ పవార్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఉద్ధవ్ థాకరే పార్టీ కూడా భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొంది. తాజా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమిని విశ్వసించారు. దాదాపు 288 సీట్లకు గాను 227 సీట్లను మహాయుతి కూటమికి కట్టబెట్టి తిరుగులేని శక్తిగా నిలిపారు.
ఇది కూడా చదవండి: Divorce Temple: విడాకుల నిర్ణయం తీసుకునే ఆలయం ఎక్కడుందో తెలుసా?
తాజావార్తలు
-
Yogurt Facial for Glowing Skin: ఖర్చు లేకుండా కాంతివంతమైన చర్మం.. పెరుగు ఫేషియల్ రహస్యం
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!