INDIA Bloc: 6 నెలల్లో ఎంత మార్పు.. లోక్సభలో అదుర్స్.. అసెంబ్లీలో తుస్!
- 6 నెలల్లో ఇండియా కూటమిపై ఎంత మార్పు
- లోక్సభలో మెరుపులు.. అసెంబ్లీలో తుస్!
- మహారాష్ట్రలో 54 సీట్లకే పరిమితమైన కూటమి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆరు నెలలకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఉవ్వెత్తున ఎగిసిపడింది. మహారాష్ట్రలో అత్యధిక లోక్సభ సీట్లను సొంతం చేసుకుంది. 48 లోక్సభ స్థానాలు ఉండగా.. అందులో కాంగ్రెస్ 13, ఉద్ధవ్ థాకరే పార్టీ 9, శరద్ పవార్ పార్టీ 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమికి గట్టి షాకిచ్చింది. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక బూస్టింగ్లాంటిదని కూటమి భావించింది. అధికారం కోసం ఎన్నో కలలు కంది. లోక్సభలో వచ్చిన ఉత్సాహమే.. అసెంబ్లీలో కూడా అదే తరహాలో ఉంటుంది అని కాంగ్రెస్ కూటమి భావించింది. తీరా ఆరు నెలలు తిరిగేసరికి అంతా తుస్మని పోయింది. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో బొమ్మ.. బొరుసైంది. మహా వికాస్ అఘాడీ కూటమి భారీ ఓటమిని కూడగట్టుకుంది. 288 స్థానాలు ఉండగా కేవలం 54 స్థానాలతో ఇండియా కూటమి సరిపెట్టుకుంది. ఇక మహాయుతి కూటమి(ఎన్డీఏ) ఏకంగా 227 స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిలిచింది.
ఇది కూడా చదవండి: Ajay Dhishan: ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. కానీ విలన్ గా?
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ పండితులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఆరు నెలల్లో ప్రజల్లో ఎంత మార్పు అంటూ సంభాషించుకుంటున్నారు. గరిష్ట స్థాయి నుంచి కనిష్ట స్థాయికి ఇండియా కూటమి పడిపోయిందని గుసగుసలాడుకుంటున్నారు. ఇక శరద్పవార్(83) ఇప్పటికే రాజకీయాలకు గుడ్బై చెప్పారు. 2026లో శరద్ పవార్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక ఉద్ధవ్ థాకరే పార్టీ కూడా భారీ ఎదురుదెబ్బను ఎదుర్కొంది. తాజా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. మహారాష్ట్ర ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏ కూటమిని విశ్వసించారు. దాదాపు 288 సీట్లకు గాను 227 సీట్లను మహాయుతి కూటమికి కట్టబెట్టి తిరుగులేని శక్తిగా నిలిపారు.
ఇది కూడా చదవండి: Divorce Temple: విడాకుల నిర్ణయం తీసుకునే ఆలయం ఎక్కడుందో తెలుసా?
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!