Maharashtra Elections: ధారావి ప్రాజెక్టు చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..
- ధారావి ప్రాజెక్టు చుట్టూ మహారాష్ట్ర రాజకీయాలు..
- ప్రాజెక్టుని నిలిపేస్తామని ఉద్ధవ్ ఠాక్రే హామీ..
- ఠాక్రేపై సీఎం ఏక్నాథ్ షిండే ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలు ముంబైలోని ధారావి స్లమ్ ఏరియా చుట్టూ తిరుగుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారావి ప్రాజెక్టు రద్దు చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. దీంతో ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మహారాష్ట్ర ఎన్నికల కోసం తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తూ, ధారావి ప్రాజెక్టు ముంబయిపై ప్రభావం చూపుతుందని, తాను అధికారంలోకి వస్తే దానిని రద్దు చేస్తామని థాకరే నిన్న చెప్పారు.
Read Also: Samosas: హిమాచల్ప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోన్న సమోసా చిచ్చు.. అసలేమైందంటే..!
Also Read
- అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
- INS Mahendragiri: భారత నౌకాదళంలోకి స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ఆత్మనిర్భర్ భారత్కు మరో మైలురాయి
- Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
అయితే, ఆయన వ్యాఖ్యలపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఠాక్రే) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టుని అడ్డుకోవడం తప్పా వారికి ఏం తెలుసు, వారి నుంచి ఏం ఆశించగలం..? అని ప్రశ్నించారు. ఈ నాయకులు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్నారని, ధారావిలోని ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. తన ప్రభుత్వం అందరికి ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఉందని, మహావికాస్ అఘాడీ తమ పథకాలను కాపీ కొట్టిందని షిండే ఆరోపించారు. వారి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలని సవాల్ విసిరారు.
ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఆసియాలోని 250 హెక్టార్లకు పైగా విస్తరించి ఉన్న అతిపెద్ద మురికివాడను డెవలప్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వం, అదానీ గ్రూప్ జాయింట్ వెంచర్. ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత అర్హులైన ఆ ప్రాంత నివాసులకు 350 చదరపు అడుగుల ప్లాట్ ఇవ్వబడుతుంది. అర్హత లేని వారికి నగరంలో మరో చోట పునరావాసం కల్పిస్తారు. రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పాఠశాలలు, కమ్యూనిటీ హాల్లు, ఆస్పత్రులను నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
-
Ellora Kailasa Temple: ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయాన్ని పై నుంచి కిందికి ఎందుకు చెక్కారు.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నిర్మాణం!
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
ట్రెండింగ్
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!