తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు. కాగా, ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. అయితే ఎవరి ఊహకు కూడా అందని ఈ కాంబినేషన్ తో గాసిప్స్ వార్తలు కూడా ఎక్కువే అవుతున్నాయి.…
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ సూచిస్తోంది. ప్రైవేట్ సంస్థలు సైతం తమ సిబ్బందికి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు సినీప్రముఖులు కూడా తమ ఆఫీస్ స్టాఫ్కు వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు తమ స్టాఫ్ మెంబర్స్కు ప్రత్యేకంగా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా తమ సిబ్బందికి మరియు తన చిత్రాలకు పని చేస్తున్న వారికి అందరికీ వ్యాక్సిన్…
తెలంగాణలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. ఈ నివేదికలను పరిశీలించిన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా థియేటర్లు కూడా…
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు,…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా రెండు నెలలకు పైగా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే ముంబయిలో షూటింగ్ లకు అనుమతినిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనూ షూటింగ్స్ కి అనుమతి వున్నా అప్పుడే సాహసం చేయటం లేదు. కాగా ఈ నెల చివర్లో షూటింగ్స్ పునప్రారంభం కానుండగా.. జులై మొదటివారంలో అన్ని సినిమాల షూటింగ్స్ మొదలు కానున్నాయి. విదేశాల్లో ప్లాన్ చేసిన షూటింగ్స్ సైతం కరోనా ప్రభావంతో హైదరాబాద్ లోనే సెట్స్…
రాహుల్ రవీంద్రన్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన తరువాత ‘చిలాసౌ’ సినిమాతో దర్శకుడుగా మారాడు. రెండో సినిమాని కింగ్ నాగార్జునతో ‘మన్మథుడు 2’ సినిమా తీసే అవకాశం వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే రీసెంట్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నిర్మాత బన్నీ వాస్ కి ఓ లవ్ స్టొరీ చెప్పి మెప్పించాడట ఈ దర్శకుడు. చాలా తక్కువ బడ్జెట్ లో క్లాసిక్ ప్రేమకథని తెరకెక్కించనున్నాడట. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్…
ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతోన్నారని తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాటు చేశారు. ఇక ఇప్పుడు చిరంజీవి మరో ముందడుగు వేశారు. అంబులెన్స్ కొరత ఉందన్న సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లడంతో త్వరలోనే అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా చిరు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సాటి మనిషి ప్రాణాన్ని కాపాడడం మానవత్వానికి సంబంధించిన మహోన్నతమైన సేవ అని…
అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లుగా పైగా అవుతున్న.. సరైన హిట్ కోసం ఎదురుస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాని దాదాపుగా పూర్తిచేసుకొని విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు అఖిల్-సురేందర్ దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ తన లుక్ ని మార్చుకొని, కొత్త గెటప్ లో…
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలోని చాలా జిల్లాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బ్యాంక్ సేవలను నెలకొల్పాడు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లతో ప్రజలకు అండగా నిలుస్తున్న చిరు.. తాజాగా చిరు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా తెలుగు రాష్ట్రాల అంతటా చిరంజీవి అంబులెన్స్ సర్వీస్ లను ప్రారంభించాలని చిరు భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారని…
ప్రస్తుతం భారతీయ చలనచిత్రసీమలో నటవారసుల హవా విశేషంగా వీస్తోంది. భారతీయ చిత్రసీమలో నటవారసత్వానికి బీజం వేసిన వారు మహానటుడు పృథ్వీరాజ్ కపూర్. దక్షిణాదిన అదే బాటలో సాగారు నటరత్న యన్టీఆర్. ఆ తరువాత నార్త్ లోనూ, సౌత్ లోనూ ఎందరో నటీనటులు తమ వారసులను చిత్రసీమలో ప్రవేశ పెట్టారు. అనేక మంది స్టార్స్ గా విజయం సాధించారు. తమ కన్నవారి పేరు నిలిపారు. అలా జయకేతనం ఎగురవేసిన నటవారసుల్లో నందమూరి బాలకృష్ణ స్థానం ప్రత్యేకమైనది. 1974లో ‘తాతమ్మకల’తో…