హ్యూమన్ రిలేషన్స్, లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకుంటూ వస్తున్న శేఖర్ కమ్ముల ఈ సారి థ్రిల్లర్ పై కన్నేశాడు. నాగచైతన్య, సాయిపల్లవితో కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో సమావేశమైన శేఖర్ తన తదుపరి చిత్రాన్ని ధనుష్తో తీయబోతున్నట్లు ధృవీకరించాడు. నిజానికి ఇప్పటికే దీని గురించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే శేఖర్ కమ్ముల ఈ సారి తను తీయబోయే సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు.…
తెలుగు చిత్ర పరిశ్రమను రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది మా సినిమా ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు సంక్షోభంలో పడిపోయింది. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని.. తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరారు. అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.. సినీ నిర్మాతలు..…
సోమవారం ఎపి మినిస్టర్ పేర్ని నానితో టాలీవుడ్ సమస్యలపై చిత్రప్రముఖుల భేటీ జరిగింది. అందులో ఫేక్ కలెక్షన్స్ గురించి నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడారు. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ వందల కోట్ల వసూళ్ళు అంటూ పేపర్లలో ఇచ్చే ప్రకటనలు కేవలం ప్రజల్ని మోసం చేయటానికే అని అన్నాడు. మా సినిమా చూడకపోతే మిస్ అవుతామేమో అనే భావన కలిగించటానికే అలాంటి ప్రకటన ఇస్తుంటామని చెప్పారాయన. అది సినిమా అనే కలర్ ఫుల్ మాయ అని మంత్రి పేర్ని…
టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, ఏపీ మంత్రి పేర్నినానితో జరిపిన సమావేశం ముగిసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, డీవీవీ దానయ్య, సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు పాల్గొన్నారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభించింది. ఆన్ లైన్ టిక్కెటింగ్ కావాలని మేమే అడిగాము. ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీకి ఊతం ఇచ్చారు’ అని సి.కళ్యాణ్ తెలిపారు. నిర్మాత…
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ముందుగా గుర్తుకు వస్తారు. ఆయన నటజీవితంలో పలు మేలుమలుపులన్నీ నవలాచిత్రాలే కావడం విశేషం. ఏయన్నార్ ను మహానటునిగా నిలిపిన ‘దేవదాసు’ చిత్రం శరత్ చంద్ర ఛటర్జీ రాసిన బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కింది. ఆ తరువాత బెంగాలీ నవలలతోనే ఏయన్నారు మంచి విజయాలను చవిచూశారు. మణిలాల్ బెనర్జీ రాసిన ‘స్వయంసిద్ధ’ ఆధారంగా రూపొందిన ‘అర్ధాంగి’లో అక్కినేని పిచ్చివాడుగా చేసిన అభినయం ఆకట్టుకుంది. మరో మహానటుడు యన్టీఆర్ తో…
టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని పేర్కొన్నారు. వెంటిలెటర్ తొలగించామని, సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. మరికొద్ది రోజులు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని వివరించారు. గత ఆదివారం సాయి ధరమ్ తేజ్కు వైద్యులు కాలర్ బోన్ సర్జరీని నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని వైద్యులు వివరించారు. సాయి ధరమ్ తేజ్ వినాయక…
నాగచైతన్య ‘లవ్ స్టోరీ’తో ఆరంభం హీరోగా టాప్ లీగ్ లోకి వెళ్లాలనుకుంటున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక కెరీర్ ఆరంభం నుంచి సినిమాలతో బిజీగా ఉన్నా బిజినెస్ పైనా దృష్టి పెట్టాడు. రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారం ఆరంభించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతర హీరోల తరహాలో థియేటర్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసేందుకు అడుగు ముందుకు వేశాడు. డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ వారితో చేతులు కలిపి మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి…
ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఇందులో చరణ్ కి జోడీగా నటిస్తోంది ఆలియా. అయితే ఆలియా టాలీవుడ్ లో మరో సినిమాకు ఓకె చెప్పిందట. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో ఆలియా నటించబోతోందట. ఎన్టీఆర్ నటిస్తున్న 30 వ చిత్రమిది. దీని కోసం అద్భుతమైన కథను రెడీ చేశాడు కొరటాల. ఎప్పటిలాగే తనదైన సోషల్ మెసేజ్ మిస్ కాకుండా పవర్…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే.. కాగా, తాజాగా ‘మా’ ఎన్నికలకు సంబంధించిన తేదీ, నియమ నిబంధనలు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తెలిపారు. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. సెప్టెంబరు 27, 28, 29 తేదీల్లో నామినేషన్లు…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ కు భారీ ఊరట లభించింది. పూరి, తరుణ్ నమునాల్లో డ్రగ్స్ లేవని ఎఫ్ఎస్ఎల్ తేల్చేసింది. పూరి, తరుణ్ రక్తం, వెంట్రుకలు, గోళ్లును రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ పరీక్షించారు. 2017 జులైలో పూరి, తరుణ్ నుంచి నమూనాలను ఎక్సైజ్ శాఖ సేకరించిన విషయం తెలిసిందే. స్వచందంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు ఇచ్చారని ఎక్సైజ్ పేర్కొంది. గతేడాది డిసెంబరు 8న ఎక్సైజ్ కు ఎఫ్ఎస్ఎల్ నివేదికలు…