Telangana Hotels on Strike: తెలంగాణలో హోటల్స్ బంద్.? గ్యాస్ సెగతో అసోసియేషన్ కీలక నిర్ణయం..!
- కమర్షియల్ గ్యాస్ కొరతతో సంక్షోభంలో హోటల్ పరిశ్రమ
- హైదరాబాద్లో అత్యవసర సమావేశం నిర్వహించిన అసోసియేషన్
- గ్యాస్ లేకపోతే హోటళ్లు బంద్ చేస్తామని హెచ్చరిక
- హోటల్ పరిశ్రమకు వెంటనే పరిష్కారం కోరుతున్న యజమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Hotels on Strike: తెలంగాణ రాష్ట్రంలోని హోటల్ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లను మూసివేసి (బంద్) నిరసన తెలపాలని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ యోచిస్తోంది. దీనిపై చర్చించేందుకు హైదరాబాద్లో అసోసియేషన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందని, అది ఇప్పుడు హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని అసోసియేషన్ వెల్లడించింది. ఇప్పటికే బెంగళూరు , ముంబై వంటి నగరాల్లో హోటల్ యజమానులు బంద్ నిర్వహిస్తుండగా, అదే బాటలో తెలంగాణలో కూడా కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించనున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో వినియోగదారులకు కనీసం వంట చేసి పెట్టే పరిస్థితి కూడా లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
- Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
- CM Revanth Reddy : ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్
- Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
Israel-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ దాడులు.. హిజ్బుల్ స్థావరాలే లక్ష్యంగా ఎటాక్
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హోటల్ పరిశ్రమకు గ్యాస్ అనేది ప్రాణవాయువు వంటిదని పేర్కొన్నారు. “ప్రస్తుతం గ్యాస్ నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. హోటళ్లలో పని చేసే సిబ్బందికి కూడా వంట చేసి పెట్టేంత గ్యాస్ నిల్వలు లేని దుస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. లేనిపక్షంలో హోటళ్లను శాశ్వతంగా మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
ఈ సమావేశం ద్వారా తమ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, తదుపరి ఏ విధమైన ఆందోళనలు చేపట్టాలనే దానిపై అసోసియేషన్ ఒక స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే ప్రజలకు ఆహారం అందించడం అసాధ్యమని, ఇది పరోక్షంగా వేలాది మంది కార్మికుల ఉపాధిపై కూడా ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
BCCI Cash Reward: రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
తాజావార్తలు
-
Honor X80: 10,000mAh భారీ బ్యాటరీతో హానర్ X80 వచ్చేస్తోంది.. పవర్ఫుల్ ఫీచర్లు హైలైట్!
-
Jagapathi Babu: “నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో”: జగపతి బాబు
-
Kitchen Hacks : మిక్సీ జార్ వేడెక్కుతుందా..? ఈ చిన్న తప్పే మసాలా రుచి పాడుచేస్తోంది.!
-
Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
-
Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
ట్రెండింగ్
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?