శనివారం వీకెండ్ కావడంతో మూవీ లవర్స్ తో థియేటర్ల వద్ద సందడిగా కనిపించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు అందుబాటులోకి వస్తున్నప్పటికి బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని మూవీ ఆడియన్స్ చెప్తున్నారు. పెద్ద సినిమాలు లేకపోయినను.. ఆడుతున్న సినిమాలపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’ రెండు వారాల్లో 8.30 కోట్ల షేర్ ను రాబట్టిందని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం –…
రెండు మూడేళ్లు సీరియల్స్లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన విజయ్ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ‘అల్లరి’ నరేశ్ హీరోగా, వరలక్ష్మీ శరత్కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ఆకట్టుకొంది. నరేష్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మలిచాడు విజయ్ కనకమేడల.. ప్రస్తుతం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదివరకే విజయ్ కనకమేడల నరేట్ చేసిన స్టోరీకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు…
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు గత కొన్ని రోజుల నుండి సంబరాలు, సేవాకార్యక్రమాలు జరుపుతుంటే… తాజాగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఒకరోజు ముందు నుండే రావడం మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లూసిఫర్’ మూవీకి తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే పేరు పెట్టారు. రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ…
బ్రేవ్ హార్ట్ పిక్చర్స్ పతాకంపై బాబా పి. ఆర్. దర్శకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘సైదులు’. అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను శుక్రవారం హీరో శ్రీకాంత్ తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ… ”టైటిల్ చాలా క్యాచీగా ఉంది. సినిమాకాన్సెప్ట్ కూడా విన్నాను. ఎంతో ఇంట్రస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా విజయం సాధించి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. చిత్ర దర్శకుడు…
మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు అధ్యక్ష పదవి కోసం పోటీపడనున్నారు. కాగా ఇప్పటికే, లోకల్-నాన్ లోకల్, మా నిధులు, మా శాశ్వత భవనం అంటూ ఒకరిపై ఒకరు పోటీదారులు ఆరోపణలు చేసుకోవడంతో వివాదం రోజుకో మలుపుతిరుగుతోంది. తాజాగా మంచు విష్ణు ట్విటర్ ద్వారా వీడియో సందేశం ఇస్తూ.. త్వరలోనే ‘మా’ శాశ్వత భవనం కల నెరవేరనుందని చెప్పుకొచ్చారు. భవనం నిర్మించడం కోసం మూడు స్థలాలు పరిశీలించామని విష్ణు తెలిపారు.…
హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. అర్జావీ రాజ్ కథానాయికగా నటించింది. యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు సోని లివ్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. లాక్డౌన్ ఇతివృత్తంగా సాగే కథతో వస్తుంది ఈ చిత్రం.. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ వినోదాత్మకంగా రానుంది. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో…
గత నెలాఖరులో సినిమా థియేటర్లను తెరచిన దగ్గర నుండి స్మాల్, మీడియం బడ్జెట్ చిత్రాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సినిమాల విడుదలకు అచ్చి వచ్చే సీజన్ ఎంత మాత్రం కాదు. అయినా… సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పెద్ద సినిమాలు వస్తే… తమకు చోటు దక్కదనే భయంతో చిన్న చిత్రాల నిర్మాతలంతా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అలా జూలై చివరి వారం ఐదు సినిమాలు విడుదలైతే… ఈ నెల ప్రథమార్ధంలో ఏకంగా 15 సినిమాలు విడుదలయ్యాయి. ఇంతవరకూ ‘తిమ్మరుసు,…
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ‘మా’ ఎన్నికలపై తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘మా’ కు శాశ్వత భవనం నిర్మించాల్సిన అవసరం లేదని బండ్ల గణేష్ అభిప్రాయపడ్డాడు. ‘మా’ అసోసియేషన్ లో సుమారు 900 మందిలో చాలా వరకూ దారిద్యరేఖకు దిగువన ఉన్నారు. వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఎంతో మంది కష్టాలు పడుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం, బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు చేసే రూ.20 కోట్లతో పేద కళాకారులందరికీ డబుల్…
బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం రేపు విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర అంకుల్స్ పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శులు కార్యదర్శి రత్నా డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ మహిళలను కించ పరిచే సన్నివేశాలున్నాయని…
నరేశ్, ఆలీతో పాటు మెట్రోట్రైన్ ముఖ్యభూమిక పోషించిన చిత్రం ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. గతేడాది నెట్ఫ్లిక్స్లో విడుదలై సంచలన విజయంగా నమోదైన మలయాళ చిత్రం ‘వికృతి’కి ఇది రీమేక్. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్ సంయుక్తంగా నిర్మించారు. సంగీత దర్శకుడు…