LPG Crisis: ప్రధాని మోడీతో పెట్రోలియం, విదేశాంగ మంత్రుల భేటీ..
- ఇరాన్ యుద్ధంతో దేశంలో ఇంధన సంక్షోభం..
- ఎల్పీజీ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు..
- ప్రధాని మోడీతో పెట్రోలియం, విదేశాంగ మంత్రుల భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ముఖ్యంగా భారత్లో LPG కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే బెంగళూర్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు(మంగళవారం) పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నతస్థాయి చర్చలు జరిపారు.
Read Also: Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!
Also Read
- Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
- West Bengal: బెంగాల్లో ‘కాక్రోచెస్’ వర్సెస్ బీజేపీ.. కార్యకర్త తండ్రి మృతితో సీజేపీ ఆగ్రహం
మధ్యప్రాచ్యంలో యుద్ధం దేశ ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత, ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్ వంటి దేశాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ దేశాల్లోన్ని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఇదే కాకుండా చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేయడంతో ఆసియా దేశాలలో చమురు సంక్షోభం ఏర్పడింది. భారత్ తన LPG అవసరాలలో 62 శాతం దిగుమతి చేసుకుంటుంది.
మరోవైపు దేశంలో సంక్షోభాన్ని నివారించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ అనేక అత్యవసర చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది. దేశీయ వినియోగదారుల కోసం LPG రీఫిల్ బుకింగ్ సైకిల్ను మునుపటి 21 రోజుల నుండి 25 రోజులకు పొడిగించారు. దీని ద్వారా బ్లాక్ చేయడం, స్టోర్ చేయడం తగ్గుతుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) నుండి ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (EDలు)తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమల నుండి ప్రాతినిధ్యాలను సమీక్షిస్తుంది, “యోగ్యత, అవసరం మరియు ఉత్పత్తి లభ్యత” ఆధారంగా గ్యాస్ పంపిణీ చేస్తుంది.
తాజావార్తలు
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!