LPG Crisis: ప్రధాని మోడీతో పెట్రోలియం, విదేశాంగ మంత్రుల భేటీ..
- ఇరాన్ యుద్ధంతో దేశంలో ఇంధన సంక్షోభం..
- ఎల్పీజీ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు..
- ప్రధాని మోడీతో పెట్రోలియం, విదేశాంగ మంత్రుల భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టింది. ముఖ్యంగా భారత్లో LPG కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే బెంగళూర్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ కొరత కారణంగా హోటల్, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు(మంగళవారం) పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నతస్థాయి చర్చలు జరిపారు.
Read Also: Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Mamata Banerjee: "నేనూ న్యాయవాదినే.. ఎలా పోరాడాలో నాకు తెలుసు".. బీజేపీపై యుద్ధం ప్రకటించిన దీదీ
మధ్యప్రాచ్యంలో యుద్ధం దేశ ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత, ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రైయిన్ వంటి దేశాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ దేశాల్లోన్ని చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఇదే కాకుండా చమురు రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ మూసేయడంతో ఆసియా దేశాలలో చమురు సంక్షోభం ఏర్పడింది. భారత్ తన LPG అవసరాలలో 62 శాతం దిగుమతి చేసుకుంటుంది.
మరోవైపు దేశంలో సంక్షోభాన్ని నివారించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ అనేక అత్యవసర చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది. దేశీయ వినియోగదారుల కోసం LPG రీఫిల్ బుకింగ్ సైకిల్ను మునుపటి 21 రోజుల నుండి 25 రోజులకు పొడిగించారు. దీని ద్వారా బ్లాక్ చేయడం, స్టోర్ చేయడం తగ్గుతుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCలు) నుండి ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (EDలు)తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమల నుండి ప్రాతినిధ్యాలను సమీక్షిస్తుంది, “యోగ్యత, అవసరం మరియు ఉత్పత్తి లభ్యత” ఆధారంగా గ్యాస్ పంపిణీ చేస్తుంది.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం