మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఆచార్య నుంచి రెండో సింగిల్ ని మేకర్స్ విడుదల చేశారు. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది. కామ్రేడ్ సిద్ద, నీలాంబరి మధ్య ఉన్న ప్రేమ గాఢతను…
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో చిత్ర పరిశ్రమ కళలాడుతోంది. మునెప్పడూ లేని విధంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే జనవరి 7 న ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో మిగతా సినిమాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన సర్కారు వారి పాట, ఆచార్య లాంటి సినిమాలు ముందుగానే తప్పుకొని వేరొక డేట్ ని ప్రకటించేశాయి. ప్రస్తుతం సంక్రాంతి బరిలో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి.. జనవరి 7 న ‘ఆర్ఆర్ఆర్’, జనవరి…
మాస్ మహారాజా రవితేజ అస్సలు తగ్గేదెలా అన్నట్లు వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. ఒకదాని తరువాత ఒకటి అధికారిక ప్రకటన చేసేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు సెట్స్ పై ఉండగా మరో రెండు సినిమాలను ప్రకటించేశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో గజదొంగ నటిస్తున్నట్లు తెలిపిన రవితేజ.. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ గా కనిపించడానికి సిద్దమైపోయాడు. ఇటీవలే ప్రీ లుక్ ని రిలీజ్ చేసిన మేకర్స్…
దీపావళీ పండగ సందర్భంగా సోషల్ మీడియా సెలబ్రిటీల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్టార్ హీరోల ఫోటోలు షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, తన వారసులతో దీపావళీ జరుపుకుంటున్న ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అభయ్ రామ్, భార్గవ్ రామ్ మధ్య తారక రామారావు సాంప్రదాయ దుస్తులతో కనిపించి కనువిందు చేశారు. తారక్ ఎప్పుడు తన వారసుల ఫోటోలను సోషల్ మీడియా లో పంచుకోడు. ఇలా పండగవేళ ముగ్గురు రామ్’లు కనిపించడంతో ఎన్టీఆర్…
హీరో డా.రాజశేఖర్కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ఫ్లైట్లో చెన్నైకు…
ఏ మనిషినైనా మంచివాడుగా, చెడ్డవాడుగా చిత్రీకరించేవి – అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ మనిషి దొంగకావడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అని చర్చించవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించే కరడు కట్టిన నేరస్థులలో సైతం పరివర్తన కలిగించాలని సామాజిక ఉద్యమకారులు గోరా, ఆయన కోడలు హేమలతా లవణం నడుం బిగించారు. ఎందరో దొంగలలో సత్ర్పవర్తన కలిగేలా చేశారు. అలా ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం అనే ఊరిలో దొంగలలో మార్పు తీసుకు…
యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో మూగ జీవాల కోసం ఆమె పడిన తపన చెప్పలేనిది. ఇక ఎక్కడైన మూగ జీవాలను హింసిస్తే రష్మీ కోపంతో రగిలిపోతుంటుంది. తాజాగా ఆమె మరోసారి జంతువులను హింసించేవారిపై ఫైర్ అయ్యింది. ఒక కుక్కను ఒక వ్యక్తి హింసిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ “ఈ వ్యక్తికి మానవత్వం ఉందా..? మానవత్వాన్ని మరిచి ఇంతగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సహచరుడు కెఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘స్టూవర్ట్ పురం దొంగ’. బయోపిక్ అఫ్ టైగర్ అనేది ట్యాగ్ లైన్. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన సాహసోపేతమైన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ చిత్రం కరోనా కారణంగా కొద్దిగా వెనక్కి తగ్గింది. ఇకపోతే ఇటీవల ఈ బయోపిక్ లో రవితేజ నటిస్తున్నాడని, ‘టైగర్ నాగేశ్వరరావు’…
ఆ మధ్య కుడిచేతి మణికట్టుకు సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి, కొద్ది రోజుల పాటు చేతికి రెస్ట్ ఇచ్చి ఇప్పుడు రఫ్ఫాడించడం మొదలెట్టేశారు. చేయినొప్పి కారణంగా ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్ కు కాస్తంత విరామం ప్రకటించిన చిరంజీవి, తిరిగి ఆ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. అంతేకాదు… ఇప్పుడు మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించబోతున్న సినిమా పూజా కార్యక్రమాలకూ ముహూర్తం ఫిక్స్ చేసేశారు. కె. ఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ నవంబర్ 6వ…
స్టార్ హీరోయిన్ సమంత మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య కు విడాకులు ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చిన అమ్మడు మరోసారి అభిమానులను షాక్ కి గురిచేయనున్నట్లు తెలుస్తోంది . ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సామ్ తొందర్లో సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పనుందంట. ట్విట్టర్ నుంచి వైదొలిగే ప్రయత్నంలో సామ్ ఉన్నట్లు రూమర్స్ గుప్పంటున్నాయి. విడాకుల విషయం దగ్గరనుంచి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.…