Home
Telangana
Telangana News
-
ఇక వరసగా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్లు.. తేదీలు ఇవిగో..
కరోనా మహమ్మారి కారణంగా చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు.. ఇక, కామన్ ఎంటెన్స్ టెస్ట్లను కూడా పలు దపాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఎంట్రెన్స్ టెస్ట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. దీంతో.. వరుసగా కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి… రేపటి నుంచి సెప్టెంబర్ రెండో… -
విభజన చట్టం ప్రకారమే నీటి వాటా పంపిణీ : జల్ శక్తి శాఖ
జల వివాదంపై క్లారిటీ ఇచ్చారు సంయుక్త కార్యదర్శి, కేంద్ర జలశక్తి శాఖ సంజయ్ అవస్తీ. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను వివరించిన ఆయన… విభజన చట్టం ప్రకారమే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరిగిందన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 84 నుంచి 91 వరకు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం గురించి ఉందని…సెక్షన్ 84 ప్రకారం రెండు నదుల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, పరిధి నోటిఫై చేయాల్సి… -
నర్సాపూర్లో మూడు గ్రూపులు, ఆరు తగాదాలుగా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి !
ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. అందరినీ కలుపుకొని పోకుండా.. సొంత కోటరీని ప్రమోట్ చేసుకుంటున్నారట. ఇంకేముందీ ఎమ్మెల్యేపై భగ్గుమనేవాళ్ల సంఖ్య పెరిగింది. వర్గాలు పుట్టుకొచ్చాయి. ఎవరి కుంపటి వారిదే. ప్రస్తుతం మూడు గ్రూపులు.. ఆరు తగాదాలుగా ఉందట అక్కడి టీఆర్ఎస్ పరిస్థితి. ఎక్కడో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మదన్రెడ్డికి బంధువులతో పొసగడం లేదా? మదన్రెడ్డి. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో ఉన్న ఆధిపత్య పోరు కారణంగా.. సొంత పార్టీ నేతలే ఆయనపై ఒంటికాలిపై… -
అధికారులు ఇచ్చిన లెక్కలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి !
చిత్తశుద్ధి లేని శివపూజలా ఉందట.. తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు. నెలల తరబడి కసరత్తు చేశామని చెబుతూ.. అధికారులు ఇచ్చిన జాబితాపై సీఎం సంతృప్తి చెందలేదు. వారికి మరో డెడ్లైన్ పెట్టారు. అసలు ఆఫీసర్లు వాస్తవ లెక్కలే ఇచ్చారా? లేక తిమ్మిని బమ్మిని చేయాలని చూశారా? ఉద్యోగ ఖాళీల లెక్కలను అధికారులు సరిచూసుకున్నారు గత డిసెంబర్లోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించారు తెలంగాణ సీఎం కేసీఆర్. వెంటనే ఖాళీలను గుర్తించి నియామక ప్రక్రియ చేపట్టాలని… -
జల వివాదం : కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ !
కేంద్ర గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్ కు సీఎం కెసిఆర్ రానున్నారు. ఈ సందర్బంగా కేంద్ర గెజిట్ పై కేసీఆర్ స్పందించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. కాగా… కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల… -
LIVE: గెజిట్ రగడ…
-
చలో రాజ్భవన్కు కాంగ్రెస్ పిలుపు…ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత…
దేశంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆందోళనలు చెందుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రేణులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్ నుంచి రాజ్భవన్… -
కోకాపేట.. అత్యధికంగా రూ.60.2 కోట్లు.. అత్యల్పంగా రూ.31.2 కోట్లు
కోకాపేట భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది… హెచ్ఎండీఏ భూములు వేలం వేయగా… అధికారులు అంచనా వేసినకంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయి.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్టీసీ వెబ్సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలకింది.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి… -
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై రేపే గెజిట్..
కృష్ణా, గోదావరి నదుల నిర్వహణ బోర్డులకు సంబంధించి రెండు గెజట్ నోటిఫికేషన్లను జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.. రేపు మధ్యాహ్నం 1.45 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ గెజిట్ నోటిఫికేషన్లు 2014లోనే విడుదల చేయాల్సి ఉండగా, అనేక అవాంతరాలతో.. ఇప్పటికే విడుదలకు సిద్ధమయ్యాయి.. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మరింత ముదరడంతో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు… -
కూలీ పనులకు వెళ్ళండన్న మంత్రి క్షమాపణలు చెప్పాలి: సునీత రావు
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిరుద్యోగులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు కూలీ పని చేసుకుంటే తప్పేంటని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. హమాలీ పనితో ఉపాధి కల్పిస్తున్నామని, హమాలీ పని మాత్రం ఉపాధి కాదా అని ప్రశ్నించారు. అయితే నిరుద్యోగులను ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఖండించారు. వెంటనే నిరుద్యోగులకు మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఉద్యోగాలు భర్తీ చేయలేని, చేత కానీ…
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!