Gas Cylinder Update: అలర్ట్.. అలర్ట్.. ఈ-కేవైసీ లేకుంటే నో బుకింగ్..!
- గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక
- ఈ-కేవైసీ తప్పనిసరి.. లేకుంటే బుకింగ్ నిలిపివేత
- సిలిండర్ బుకింగ్పై కొత్త 25 రోజుల నిబంధన
- కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కఠిన నియంత్రణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Cylinder Update: గ్యాస్ వినియోగదారులకు పెట్రోలియం కంపెనీలు, ప్రభుత్వం అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని, లేనిపక్షంలో సిలిండర్ బుకింగ్ సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. అర్హులైన వారికే సబ్సిడీ అందేలా చూడటంతో పాటు అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా..!
Also Read
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం.. ఎయిర్పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా లేదా ఆన్లైన్ యాప్స్ సాయంతో ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనికి తోడు, గృహ వినియోగ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు బుకింగ్ వ్యవధిని కూడా సవరించారు. ఇప్పుడు ఒక సిలిండర్ పొందిన తర్వాత రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి కనీసం 25 రోజుల సమయం ఉండాలని నిబంధన విధించారు.
Team India Schedule 2026: టీమిండియా మళ్లీ మైదానంలోకి వచ్చేది అప్పుడే.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాపై పెట్రోలియం కంపెనీలు కఠినమైన నియంత్రణలను అమలులోకి తెచ్చాయి. గ్యాస్ నిల్వలు తగ్గిపోవడంతో ప్రాధాన్యత క్రమంలో సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా హోటళ్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవలను దృష్టిలో ఉంచుకుని కేవలం ఆస్పత్రులు, విద్యా సంస్థల హాస్టళ్లకు మాత్రమే గ్యాస్ సరఫరా చేయాలని కంపెనీలు స్పష్టం చేశాయి.
ఈ నిర్ణయం వల్ల హోటల్ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. వినియోగదారులు ఈ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా గృహ వినియోగదారులు గ్యాస్ నిలిపివేత సమస్య తలెత్తకుండా వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
-
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
-
E20 Petrol: ఈ20 పెట్రోల్పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!