LPG Supply: గ్యాస్ సరఫరాపై మంత్రి టెలీకాన్ఫరెన్స్.. ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Supply: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.
ఎక్కడి నుంచి సరఫరా?
రాష్ట్రానికి గ్యాస్ సరఫరా ప్రధానంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీ విశాఖపట్నం నుంచి జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా Mangaluru నుంచి వచ్చే హస్సన్–చర్లపల్లి పైపులైన్ ద్వారా కూడా సరఫరా కొనసాగుతుందని తెలిపారు. అలాగే Bharat Petroleum, Indian Oil Corporation సంస్థల ద్వారా రాష్ట్రానికి గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు మంత్రి నాదెండ్ల..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు చర్యలు
గ్యాస్ బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లాల జాయింట్ కలెక్టర్లు గ్యాస్ సరఫరాపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. అలాగే గ్యాస్ సరఫరాలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే సరిదిద్దే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మరోవైపు.. గ్యాస్ కొరతపై పుకార్లు సృష్టించి ధరలు పెంచినా, సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దని సూచించారు. అంతర్జాతీయ యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ఎలాంటి ప్రభావం లేదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!