తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్లో తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. తాజాగా సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతోంది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటుచేస్తామని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ సోమవారం నాడు ప్రకటించారు. 2025 నాటికి తొలిదశ ప్రారంభం అవుతుందని తెలిపారు. తర్వాత దశలవారీగా విస్తరిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ పరిశ్రమల…
ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవో 58, 59 నిబంధనలనే కొనసాగించింది. ఆక్రమిత భూములకు సంబంధించి జీవో 59 కింద రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. గతంలో ఉన్న ఆస్తి విలువలో 12.5% చెల్లించే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. మార్చి 31వ తేదీ వరకు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తును…
తెలంగాణ రాష్ట్ర పండుగ మేడారం జాతర వైభవంగా జరుగుతోంది. మేడారం జాతరకు భారీ ఎత్తున ప్రజలు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు రాష్ట్రం మొత్తానికి కాకుండా కేవలం వరంగల్, పెద్దపల్లి జిల్లాలకే వర్తించనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం సెలవు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వరంగల్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు సెలవులపై ప్రకటన చేశారు. మేడారం జాతర సందర్భంగా వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో శుక్రవారం…
మహబూబ్నగర్, నల్గొండ పట్టణాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు (UDAలు) ప్రధాన నగరాలు, పట్టణాల చుట్టూ చక్కటి సమగ్ర మరియు ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని నిర్ధారించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. రోడ్డు నెట్వర్క్, నీటి సరఫరా, ఉపాధి అవకాశాలు మరియు శాటిలైట్…
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. రేపో.. మాపో మరో 40వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. కొత్త జోనల్ విధానంతో యువతకు కావాల్సిన హక్కులు సాధించామని ఆయన తెలిపారు. మల్టీ జోనల్ విధానంతో కేవలం 5శాతం మాత్రమే నాన్ లోకల్ వారు మాత్రమే వస్తారని కేసీఆర్…
ఉమ్మడి కరీంనగర్లో భారీగా పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువ నేటి నుంచి పెరిగిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మార్కెట్ విలువ అమాంతం పెంచడంతో ప్రజల పై దాదాపుగా 40కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలో గజానికి 32,500 ఉంటే ఇప్పుడు 37,400 అయ్యింది. మార్కెట్ ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ ఫీజు సైతం గణనీయంగా పెరుగుతుంది.గతంతో పోలిస్తే ఇప్పుడు లక్షల్లో తేడా వస్తుంది. పెరిగిన రిజిస్ట్రేషన్…
సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి సుప్రీం కోర్టు సిర్పూర్కర్ కమిషన్ను నియమించిన సంగతి తెల్సిందే.. ఈ ఎన్కౌంటర్ పై అప్పట్లో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కమిషన్ 47 రోజుల్లో 57 మంది సాక్షులను విచారించి నివేదికను రూపొందించింది. కమిషన్ విచారణలో ఫోరెన్సిక్ నివేదికలు, పోస్టు మార్టం వివేదికలు, ఫోటో గ్రాఫ్స్, వీడియో గ్రాఫ్స్తో పాటు వివిధ డాక్యుమెంటరీలను ఈ కమిషన్ సేకరించింది. కాగా దిశ ఎన్కౌంటర్లో 19-2019 క్రైమ్…
రాష్ట్రంలో కొనసాగుతున్న ఫీవర్ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కరోనా లక్షణాలు లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కోవిడ్ లక్షణాల బారిన పడుతున్నారు జనాలు. ఫీవర్ సర్వే ప్రారంభం అయిన 9 రోజుల్లోనే 4,00,283 మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈనెల 21 నుంచి 29 వరకు నిర్వహించిన ఫీవర్ సర్వే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవల ద్వారా స్పష్టమైంది. అయితే కోవిడ్ వ్యాధిపై అవగాహన…
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వారాంతపు సంతల్లో కోవిడ్ జాగ్రత్తలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అటు ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. పాఠశాలల పున:ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. Read Also: తెలంగాణలో భూములకు కొత్త మార్కెట్…
తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి పెరిగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూముల విలువ సవరణను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం, ఖాళీ స్థలాలు 35 శాతం, అపార్ట్మెంట్ ఫ్లాట్ విలువ 25-30 శాతం పెంచుతూ రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మార్కెట్ విలువకు సవరించిన విలువకు మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం ఉండనున్నట్లు సమాచారం. Read Also: నిరుపేదలకు శుభవార్త.. ప్రారంభానికి సిద్ధమవుతున్న సర్కారు ఇళ్లు మరోవైపు…