Nethanna Bheema Scheme: గుడ్న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. మరో కొత్త పథకానికి శ్రీకారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అయ్యింది.. జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నల కోసం నూతన బీమా పథకాన్ని ప్రారంభించనుంది.. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు మంత్రి కేటీఆర్.. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయనున్నామని వెల్లడించారు.. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా.. సంబంధిత వ్యక్తి నామినీకి రూ.5 లక్షలు అందచేస్తామన్నారు. పది రోజుల్లో ఈ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని ప్రకటించారు..
Read Also: Savitramma Gari Abbayi: హీరో ఓవరాక్షన్.. చెంప చెల్లు మనిపించిన.. వీడియో వైరల్..
Also Read
- Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
- Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. ఈ 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
జాతీయ చేనేత దినోత్సవం రోజున నేతన్నల కోసం ఈనెల 7వ తేదీన నేతన్న భీమా పథకం ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్.. రైతు బీమా మదిరే నేతన్నకు ఈ బీమా పథకం వర్తింపజేయనున్నారు.. దీంతో రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికుకు లబ్ధి చేకూరనుంది.. 60 సంవత్సరాలలోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడిగా ప్రకటించింది ప్రభుత్వం.. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల బీమా పరిహారం వారి కుటుంబానికి అందించనుంది సర్కార్.. ఈ పథకం కోసం చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్న బీమా కోసం ఎల్ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని స్పష్టం చేశారు.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్ కేటాయించిందని.. ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్.
తాజావార్తలు
-
Save The Tigers 3: ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 వచ్చేస్తోంది.. వెన్నెల కిషోర్ ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ ఫన్ లోడింగ్
-
Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
-
Sonam Wangchuk: “నేపాల్లో జరిగినట్లే భారత్లో కూడా”.. ‘కాక్రోచ్’ ఉద్యమంపై సోనం వాంగ్చుక్ హెచ్చరిక
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
ట్రెండింగ్
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!