Summer Holidays: తెలంగాణ సర్కార్ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు సెలవులిస్తారా అని చూసే వారికోసం ఎండాకాలం సెలవులను ప్రకటించింది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ కొనసాగుతుంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు.
ఇప్పటివరకు జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్లన్నీ అక్రమ కట్టడాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో డెక్కన్ నైట్ వేర్ స్టోర్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని మంత్రి పరిశీలించారు.
Sabitha Indra Reddy: టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక ప్రకటించారు. ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Telangana Government: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 3 అధునాతన ఆస్పత్రుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్టులకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డును అందజేసింది. సనత్ నగర్, ఎల్బీ నగర్, ఆల్వాల్ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేందుకు 3 నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. ఈ ఆస్పత్రులను టిమ్స్ అనే పేరుతో పిలుస్తారు.
Free Rice:కొత్త సంవత్సరం వచ్చేసింది.. జనవరి నెల ప్రారంభమై 10 రోజులు గడిచినా.. సంక్రాంతి పండుగ సమీపిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా రేషన్ పంపిణీ చేయడం లేదు ఏంటి? అంటూ రేషన్కార్డు దారులు అంతా ఎదురుచూస్తున్నారు.. సాధారణంగా 5వ తేదీ నుంచి డీలర్లు బియ్యం పంపిణీ ప్రారంభిస్తారు.. కానీ, ఈ నెల మాత్రం 10వ తేదీ దాటినా బియ్యం పంపిణీ ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెళ్లువెత్తాయి.. ఈ సమయంలో శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచి…
Record liquor sales in Telangana: న్యూ ఇయర్ తెలంగాణ ప్రభుత్వానికి కాసులు వర్షాన్ని కురిపించింది. తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఏరులైపారింది. రికార్డు స్థాయిలో లిక్కర్ సేల్స్ నమోదు అయ్యాయి. మళ్లీ మందు దొరకదు అన్న రీతిలో మందుబాబులు తెగతాగేశారు. డిసెంబర్ 31 రోజు రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. శనివారం ఒక్క రోజు అబ్కారీ శాఖకు రూ. 215.74 కోట్ల ఆదాయం వచ్చింది. గతంతో పోలిస్తే అమ్మకాలు తగ్గినప్పటికీ పెరిగిన రేట్ల కారణంగా…
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మందు తాగేవారు ఏమంటారంటే, చుక్క మందు, చికెన్ ముక్కతో చల్లబడి ఎంజాయ్ చేద్దాం అనే రీతిలో ఎంజాయ్ చేసేందుకు సిద్దమవుతున్నారు.
రాష్ట్రంలోని బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేసేందుకు ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతును కూలీగా మార్చేందుకు కుట్రలు చేస్తోందన్నారు. విప్లవాత్మకమైన రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల లబ్ధిదారుల సంఖ్యను పెంచుతుండగా, కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు ఇచ్చే కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్యను తగ్గిస్తోంది.
ఉపాధిహామీ పథకం.. తెలంగాణ ప్రభుత్వానికి అక్షయ పాత్రగా మారింది బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రైతు కల్లాలు ఎక్కడ ఉన్నాయి ? అని ప్రశ్నించారు. బిల్లులు ఎత్తుకున్నారు ? చట్ట వ్యతిరేకంగా వాడారు ? కల్లాల పేరుతో బీఆర్ఎస్ నేతలు తిన్నది అడిగితే.. కేంద్రం రైతు వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.