Piyush Goyal: ప్రధానిని, నన్ను అవమానకరంగా తిట్టినా.. రైతుల కోసం ఈ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Piyush Goyal’s comments on TRS: టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీని, నన్ను అవమానకరంగా తిట్టారని, పేదలకు బియ్యం అందకుండా అన్యాయం చేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. తెలంగాణలో వడ్లు, బియ్యం సేకరణ చేయాలని ఎఫ్ సీ ఐని ఆదేశించినట్లుగా ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. పేదలకు బియ్యం అందకుండా చేసిందని.. ఏప్రిల్, మే నెలల్లో బియ్యం ఇవ్వకుండా పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. రైస్ మిల్లుల్లో అక్రమాలు జరిగాయిని..అందుకే మేము ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. మేము తీసుకున్న చర్యల వల్లే ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరికాదని పియూష్ గోయల్ అన్నారు. వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
Read Also: Kishan Reddy: తెలంగాణకు మరో 20 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల
Also Read
బియ్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర నిర్ణయించింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
కేంద్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదని.. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్య రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని.. కానీ పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. సివిల్ సప్లై అధికారులతో మాట్లాడానని.. ఇంకా ఆదేశాలు రాలేదని వారు వెల్లడించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. పేదలకు ఇవ్వాల్సిన ఉచిత బియ్యాన్ని రాష్ట ప్రభుత్వం దగ్గర పెట్టుకొని పంచడం లేద.. ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా ఎందుకు చేశారో తెలియడం లేదని సెటైర్లు వేశారు. నూకలు కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని..కమిటీ వేసిందని అయినా ఇప్పటి వరకు ఏమి కాలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో రైస్ డిస్ట్రిబ్యూషన్, ప్రొక్యూర్మెంట్ చేయాలని రాష్ట్రాలతో, రైస్ మిల్లర్లతో మాట్లాడామని కిషన్ రెడ్డి తెలిపారు. రైస్ మిల్లర్లు అక్రమాలు చేశారు.. కేసులు నమోదు అయ్యాయని.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!