ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు.
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్జేడీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నవారు, బెయిల్పై ఉన్నవారు ప్రధాని నరేంద్రమోడీని జైలుకు పంపాలని మాట్లాడుతున్నారని, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసాభారతీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
Tejashwi Yadav: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితిష్ కుమార్ ప్రధాని మోడీ పాదాలను తాకడం ఆ రాష్ట్రంలో రాజకీయంగా ప్రతిపక్షాలకు విమర్శణాస్త్రంగా మారింది.
Tejashwi Yadav: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమతో పొత్తు పెట్టుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్ని క్షమించాలని కోరాడని ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ అన్నారు. 2022లో పొత్తు పెట్టుకోవడానికి ముందు లాలూను గత ద్రోహాన్ని మరిచి క్షమించాలని కోరాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెలలో నితీష్ కుమార్ ఆర్జేడీ పొత్తును కాదని మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాడు.
పరువునష్టం దావా కేసులో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై వేసిన పరువునష్టం ఫిర్యాదును న్యాయస్థానం కొట్టేసింది.
బీహార్లో జేడీయూ బీజేపీ మద్దతుతో సర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీష్ సర్కారు నేడు బలపరీక్షను ప్రవేశపెట్టింది. బలపరీక్షకు ముందు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీష్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు.
Tejashwi Yadav: బీహార్లో మరోసారి బీజేపీ-జేడీయూ ప్రభుత్వం కొలువదీరబోతోంది. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఎన్డీయే కూటమిలోకి సీఎం నితీష్ కుమార్ చేరిపోయారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. ఇదిలా ఉంటే మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ ముఖ్యనేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా మాట్లాడారు.
మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పాట్నా కార్యాలయంలో హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. భూములు తీసుకుని.. బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ ఇద్దరు నేతలను విచారించనున్నారు.
Lalu Yadav: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు ప్రస్తుత బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్’ స్కామ్లో లాలూ కుటుంబం నిందితులుగా ఉంది. తేజస్వీ యాదవ్కి శుక్రవారం ఈడీ సమన్లు అందగా.. డిసెంబర్ 27న ఏజెన్సీ ముందు హాజరు కావాలని లాలూని ఈడీ కోరింది