బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కూడా ఎన్నికల చదరంగంలోకి దిగేశాయి.
బీహార్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు తేజస్వి యాదవ్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తేజస్వి యాదవ్ కాన్వాయ్లోకి ప్రవేశించిన ఓ ట్రక్కు ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో తేజస్వి యాదవ్ మాధేపుర నుంచి పాట్నాకు తిరిగి వస్తున్నారు.
Bihar: అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవల, తేజ్ ప్రతాప్ తన ప్రియురాలు అనుష్క యాదవ్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా పరిచయం చేశాడు. తామిద్దరం 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, రిలేషన్లో ఉన్నామని చెప్పారు. దీని తర్వాత, లాలూ ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ని 6 ఏళ్ల బహిష్కరించారు. పార్టీతో, కుటుంబంతో…
Tej Pratap Yadav: బీహార్ ఎన్నికల ముందు ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ నుంచి తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ని 6 ఏళ్లు బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ నేత, లాలూ మరో కుమారుడు తేజస్వీ యాదవ్ సమర్థించారు. ఈ వివాదంపై తేజస్వీ మాట్లాడుతూ.. తన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెద్దవాడని, సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయనకు…
బీహార్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్హాట్గా నడిచాయి. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్-ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన తేజస్వీ యాదవ్.. రాష్ట్రంలో ఆదాయం లేనప్పటికీ బడ్జెట్ పెరిగిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఎన్నికలప్పుడే ప్రధాని మోడీకి బీహార్ రాష్ట్రం గుర్తుస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ సోమవారం బీహార్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్.. మోడీ టూర్ను ఉద్దేశించి 15 ప్రశ్నలు సంధించారు.
2024 లోక్సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడంపై మీడియా అడిగిన ప్రశ్నకు తేజస్వీ ఈ విధంగా స్పందించారు.
Priyanka Gandhi: పట్నాలోని గాంధీ మైదాన్ వద్ద ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్రంగా ఖండించింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో యువతపై డబుల్ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని పేర్కొనింది.
Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలోని తన అధికారిక బంగ్లా నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినట్లు బీజేపీ ఆరోపించింది. రెండు రోజుల క్రితం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వీ యాదవ్.. ఎయిర్ కండీషనర్లు(ఏసీలు), బెడ్, నల్లాలు, వాష్ బెసిన్ వంటి వస్తువుల్ని తీసుకెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. ‘‘5 దేశరత్న మార్గ్ నివాసం నుంచి మంచం, ఏసీ,…