Rajnath Singh: ‘‘చేపలు, ఏనుగులు, గుర్రాలను తినండి ఎందుకు చూపించడం.?’’ తేజస్వీపై రాజ్నాథ్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్జేడీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నవారు, బెయిల్పై ఉన్నవారు ప్రధాని నరేంద్రమోడీని జైలుకు పంపాలని మాట్లాడుతున్నారని, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసాభారతీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆర్జేడీ నాయకుడు, లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ కొన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నవరాత్రుల్లో మాంసాహారం తింటున్నారని ఆరోపించారు. ‘‘నవరాత్రుల్లో చేపలు తింటున్నాము. ఏం సందేశం ఇవ్వాలని అనునకుంటున్నావు. చేపలు, పందులు, పావురం, ఏనుగు, గుర్రం ఏది కావాలంటే అది తిను, ఇందులో అందరికి చూపించాల్సిన అవసరం ఏం ఉంది.. దీని కారణంగా ఒక నిర్ధిష్ట మతానికి చెందిన ప్రజలు తమకు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు.’’ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. మెజారిటీ వర్గం మనోభావాలను వీరు బుజ్జగింపు రాజకీయాల కోసం దెబ్బతిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Maldives: మాల్దీవులను విడిచిపెట్టిన 2వ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది.. ప్రకటించిన మహ్మద్ ముయిజ్జూ..
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
బీహార్లోని జముయిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే అభ్యర్థి రామ్ విలాస్ పాశ్వాన్ బావ అరుణ్ భారతికి మద్దతు ఇచ్చేందుకు రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్లారు. ఇటీవల తేజస్వీ యాదవ్ చేపలు తింటున్న వీడియో వైరల్ అయింది. నవరాత్రుల సందర్భం ఇలాంటి పనులు చేయడమేంటని బీజేపీ ప్రశ్నిస్తోంది.
జైలులో ఉన్నవారు, బెయిల్పై ఉన్నవారు మోడీని జైలుకు పంసిస్తారా..? బీహార్ ప్రజలు అన్నింటిని సహిస్తారు, కానీ దీన్ని కాదు అని ఆర్జేడీ నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ హామీ ఇచ్చినట్లుగా ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటివి నెరవేర్చామని, రామ్ లల్లా తన గుడిసెను వదిలి రాజభవనంలోకి ప్రవేశించారని ఆయన అన్నారు. ఇండియాలో రామరాజ్యాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ప్రపంచమంతా చెబుతోంది. వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలకు ప్రపంచదేశాలు ఆయనను ఆహ్వానించాయని చెప్పారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!