Rajnath Singh: ‘‘చేపలు, ఏనుగులు, గుర్రాలను తినండి ఎందుకు చూపించడం.?’’ తేజస్వీపై రాజ్నాథ్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్జేడీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్నవారు, బెయిల్పై ఉన్నవారు ప్రధాని నరేంద్రమోడీని జైలుకు పంపాలని మాట్లాడుతున్నారని, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసాభారతీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆర్జేడీ నాయకుడు, లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ కొన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నవరాత్రుల్లో మాంసాహారం తింటున్నారని ఆరోపించారు. ‘‘నవరాత్రుల్లో చేపలు తింటున్నాము. ఏం సందేశం ఇవ్వాలని అనునకుంటున్నావు. చేపలు, పందులు, పావురం, ఏనుగు, గుర్రం ఏది కావాలంటే అది తిను, ఇందులో అందరికి చూపించాల్సిన అవసరం ఏం ఉంది.. దీని కారణంగా ఒక నిర్ధిష్ట మతానికి చెందిన ప్రజలు తమకు ఓట్లు వేస్తారని భావిస్తున్నారు.’’ అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. మెజారిటీ వర్గం మనోభావాలను వీరు బుజ్జగింపు రాజకీయాల కోసం దెబ్బతిస్తున్నారని ఆరోపించారు.
Read Also: Maldives: మాల్దీవులను విడిచిపెట్టిన 2వ బ్యాచ్ భారత సైనిక సిబ్బంది.. ప్రకటించిన మహ్మద్ ముయిజ్జూ..
Also Read
- Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
బీహార్లోని జముయిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే అభ్యర్థి రామ్ విలాస్ పాశ్వాన్ బావ అరుణ్ భారతికి మద్దతు ఇచ్చేందుకు రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్లారు. ఇటీవల తేజస్వీ యాదవ్ చేపలు తింటున్న వీడియో వైరల్ అయింది. నవరాత్రుల సందర్భం ఇలాంటి పనులు చేయడమేంటని బీజేపీ ప్రశ్నిస్తోంది.
జైలులో ఉన్నవారు, బెయిల్పై ఉన్నవారు మోడీని జైలుకు పంసిస్తారా..? బీహార్ ప్రజలు అన్నింటిని సహిస్తారు, కానీ దీన్ని కాదు అని ఆర్జేడీ నాయకులపై ఆయన ఫైర్ అయ్యారు. బీజేపీ హామీ ఇచ్చినట్లుగా ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం వంటివి నెరవేర్చామని, రామ్ లల్లా తన గుడిసెను వదిలి రాజభవనంలోకి ప్రవేశించారని ఆయన అన్నారు. ఇండియాలో రామరాజ్యాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. నరేంద్రమోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని ప్రపంచమంతా చెబుతోంది. వచ్చే ఏడాది జరిగే కార్యక్రమాలకు ప్రపంచదేశాలు ఆయనను ఆహ్వానించాయని చెప్పారు.
తాజావార్తలు
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!