Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ, ఎన్డీయే కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అయితే బీజేపీ చెబుతున్న ప్రకారం సొంతగా 370 సీట్లు, ఎన్డీయేకి 400+ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని చెప్పారు. 2019 ఫలితాలకు సమానంగా లేకపోతే కాస్త ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఆయన అంచనాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఎజెంట్ అని విమర్శించడం మొదలుపెట్టాయి.
Read Also: US warning: వెనిజులా వెళ్లొద్దని పౌరులకు అమెరికా హెచ్చరిక
Also Read
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
- Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్పై నుంచి సోనమ్ వాంగ్చుక్ భావోద్వేగ సందేశం
తాజాగా లాలూ పార్టీ ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ శుక్రవారం మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ అని, బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసే ఓ కథనాన్ని సెట్ చేయాడానికి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అమిత్ షా కోరిక మేరకే ప్రశాంత్ కిషోర్ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిని చేశానని, నితీష్ కుమార్ కూడా చెప్పారని, ఇప్పటి వరకు అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ కానీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదని, ఆయన బీజేపీతో ఉన్నారని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ జీతాలు తీసుకునే జిల్లా అధ్యక్షులను పెట్టుకున్నాడని, ఇది బీజేపీకి కూడా లేదని, అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదని, అతను ప్రతీ ఏడాది వేర్వేరు వ్యక్తులతో పనిచేస్తుంటారని, అతను మీ డేటాను తీసుకుని వస్తారు, అతను బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదని, బీజేపీ మైండ్ అని, వారి సిద్ధాంతాలను అనుసరిస్తారని బీజేపీ వ్యూహంలో భాగంగా అతనికి నిధులు వస్తున్నాయని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఇటీవల బీజేపీ ప్రశాంత్ కిషోర్ని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించుకుందనే ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయిన తర్వాత తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి