Tejashwi Yadav: “క్షమించాలని” సీఎం నితీష్ కుమార్ లాలూని వేడుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తమతో పొత్తు పెట్టుకోవడానికి లాలూ ప్రసాద్ యాదవ్ని క్షమించాలని కోరాడని ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వీ యాదవ్ అన్నారు. 2022లో పొత్తు పెట్టుకోవడానికి ముందు లాలూను గత ద్రోహాన్ని మరిచి క్షమించాలని కోరాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెలలో నితీష్ కుమార్ ఆర్జేడీ పొత్తును కాదని మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాడు.
బీజేపీ తన పార్టీని చీర్చేందుకు, తన ఎమ్మెల్యేలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తోందని తన తల్లిదండ్రుల వల్ల నితీష్ కుమార్ క్షమాపణలు వేడుకున్నారని తేజస్వీ వెల్లడించారు. మొదట్లో ఆయనను నమ్మేందుకు మేము పెద్దగా మొగ్గు చూపలేదని, బీజేపీ వ్యతిరేకంగా పోరాటంలో కలిసి వస్తారని, దేశవ్యాప్తంగా పలు పార్టీలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నితీష్ కుమార్ సీఎంగా అలసిపోయారని అన్నారు. కేవలం తాను 17 నెలల్లోనే మా ప్రభుత్వంలో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు, అందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు.
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
Read Also: Health Tips: నోటి పుండ్లు వస్తే టొమాటోలతో ఇలా చేయండి.. వెంటనే తగ్గిపోతుంది
ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, మీ నాన్న (లాలూ) డబ్బును వారికి జీతంగా ఇస్తావా.? అని నితీష్ కుమార్ ఎద్దేవా చేశారని, అయితే తాను మీ ప్రభుత్వానికి మా మద్దతు ఉందని, మేము ఇచ్చిన 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల వాగ్దానాన్ని నెరవేర్చడంలో మాకు సాయం చేయాలని చెప్పానని తేజస్వీ అన్నారు. బీహార్లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోందని, అయితే నితీష్ కుమార్ మాత్రం మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, మళ్లీ అతను ప్లేటు మార్చరనే గ్యారెంటీ లేదని విమర్శించారు. మా నుంచి నితీష్ కుమార్ ఎందుకు విడిపోతున్నారో అడిగామని, అందుకు ఆయన దగ్గర సమాధానం లేదని చెప్పారు. ఈడీలకు మేము భయపడేది లేదని అన్నారు.
తాజావార్తలు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
-
High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!