Delhi: సుప్రీంకోర్టులో తేజస్వీయాదవ్కు ఊరట.. పరువునష్టం కేసు కొట్టివేత
పరువునష్టం దావా కేసులో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆయనపై వేసిన పరువునష్టం ఫిర్యాదును న్యాయస్థానం కొట్టేసింది. ‘గుజరాతీలు మాత్రమే దొంగలు కాగలరు.’ అంటూ తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాతీ వాసి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణను గుజరాత్ వెలుపలి కోర్టుకు బదిలీ చేయాలంటూ తేజస్వీ యాదవ్ వేసిన పిటిషన్పై జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది(Supreme court).
గుజరాతీయులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ జనవరి 19న సుప్రీం కోర్టులో తేజస్వీ యాదవ్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థనను విచారించిన ధర్మాసనం పరువునష్టం ఫిర్యాదుపై విచారణను నిలిపేస్తూ.. కేసు దాఖలు చేసిన గుజరాత్ వాసికి నోటీసు జారీ చేసింది.
Also Read
- KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్కే పరిమితమైన PBKS..
- Rishab Pant: రిషబ్ పంత్ ఆట ముగిసిందా..? లక్నో కెప్టెన్ ఫామ్పై బౌలింగ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు..
స్థానిక వ్యాపారవేత్త హరీష్ మెహతా.. తేజస్వీ యాదవ్పై పరువు నష్టం కేసు దాఖలు చేయడంతో గుజరాత్ కోర్టు 2023 అగస్టులో ప్రాథమిక విచారణ చేపట్టింది. 2023 మార్చిలో పట్నాలో తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో గుజరాతీయులు మాత్రమే దొంగలు కాగలరని.. వారు బ్యాంకులకు చెల్లించాల్సిన డబ్బుతో పారిపోతే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు గుజరాతీయులను కించపరిచేలా ఉన్నాయని మెహతా ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొత్తానికి పరువునష్టం కేసును సుప్రీంకోర్టు కొట్టేయడంతో తేజస్వీ యాదవ్కు ఉపశమనం లభించింది.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!