యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు నిన్న భారత జట్టును ప్రకటించింది బోర్డు. అయితే ఈ జట్టుకు మెంటార్ గా భారత మాజీ కెప్టెన్ ధోనిని ఎంపిక చేసింది. ఇక ఈ విషయం పై భారత మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ స్పందించాడు. ధోనిని ప్రపంచ కప్ జట్టుకు మెంటార్ గా నియమించడం మంచి విషయం. ధోని జట్టులో ఉండటంతో ఆటగాళ్లకు కొత్త ఉత్సహం వస్తుంది. కానీ ఈ విషయంలో…
టీమిండియాను కరోనా వేంటాడుతోంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడడం తెలిసిందే. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు టీమిండియా సహాయక బృందంలో మరొకరికి కరోనా వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. రేపు ఇంగ్లండ్తో ప్రారంభయ్యే చివరి ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. మరోవైపు టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు…
ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తోంది. అందులోనూ స్పోర్ట్ స్టార్స్ బయోపిక్ లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న మన ఇండియన్ క్రికెటర్స్ లో బయోపిక్స్ గా తెరకెక్కింది మాత్రం ఇద్దరివే. ఒకరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాగా మరొకరు కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ. ఇక 1983లో వరల్డ్ కప్ సాధించిన ఇండియా విక్టరీని 83 పేరుతో సినిమాగా తీస్తున్నారు. ఈ సినిమా విడుదల కోవిడ్ కారణంగా వాయిదా…
అక్టోబర్ 17 నుండి టీ20 వరల్డ్ కప్ 2021 యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణ హక్కులు బీసీసీఐ కే ఉన్న భారత్ లో కరోనా కారణంగా యూఏఈ వేదికగా నిర్వహిస్తుంది. ప్రపంచ కప్ దగ్గరకు వస్తుండటంతో ఒక్కొక్కటిగా అన్ని బోర్డులు తమ జట్లను ప్రకటిస్తుండగా తాజాగా బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించింది. ఇక ఈ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తించగా హిట్ మ్యాన్ రోహిత్…
స్వదేశంలో కన్నా విదేశాల్లో విజయం చాలా స్వీట్. ఎప్పుడోగానీ అలాంటి విక్టరీలు దక్కవు. ఓవల్ టెస్ట్ విన్ కూడా అలాంటిదే. స్వీట్ స్వీట్ విక్టరీ. ఇంగ్లండ్పై వరసగా రెండో టెస్టులో విజయం సాధించి క్రికెట్ ఫ్యాన్స్ను పండగ చేసుకోమంది కోహ్లీసేన. నిజమే..అభిమానులకు.. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విజయంఇది. ఈ గెలుపుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంగ్లండ్లో ఇంగ్లండ్ను వరసగా రెండు టెస్టుల్లో ఓడించటం చరిత్రలో రెండు సార్లే జరిగింది. మొదటిసారి 1986లో .. కపిల్…
భారత జట్టులో కరోనా కలకలం రేపింది. టీం ఇండియా హెడ్ కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నిన్నటి నుంచి కాస్త అస్వస్థకు గురైన ఆయన… ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే… ఈ కరోనా పరీక్షల్లో కోచ్ రవి శాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కోచ్ రవి శాస్త్రి కి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అలాగే… రవి శాస్త్రి తో సన్నిహితంగా ఉన్నటు వంటి బౌలింగ్ కోచ్ అరుణ్,…
పారాలింపిక్స్ లో భారత్ కు వరుస పతకాలు వస్తున్న వస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్క రోజే నాలుగు పతకాలు సాధించిన భారత అథ్లెట్లు ఈ రోజు కూడా పతకాల వేటను ప్రారంభించారు. పారా బ్యాడ్మింటన్ ఇండియా ప్లేయర్ సుహాస్ యతిరాజ్ రజతం సాధించాడు. సెమిస్ లో అద్భుత ప్రదర్శన చేసి సుహాస్ ఫైనల్స్ కు చేరుకున్నాడు. అయితే ఫైనల్ లో దూకుడుగా వ్యవరించి మొదటి రౌండ్ ను సొంతం చేసుకున్న సుహాస్ ఆ తర్వాతి రెండు…
జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్ నేటితో ముగియనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సారి మనదేశ క్రీడాకారులు దుమ్మురేపారు. ఏకంగా పదిహేడు పతకాలు సాధించారు. పారా ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులపై.. దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. టోక్యో పారా ఒలింపిక్స్.. భారత క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్యాలు కలిపి ఏకంగా మన క్రీడాకారులు.. 17 పతకాలు సాధించారు. ఆగస్టు 24న ప్రారంభమైన ఈ పారా…
నాల్గో టెస్టులో భారత బ్యాట్స్మెన్లు…అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్తోపాటు వన్డౌన్ బ్యాట్స్మెన్ పూజారా…రాణించారు. దీంతో భారత్ 3వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. 171 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ జడేజా క్రీజులో ఉన్నారు. మరో 150 పరుగులు చేస్తే…భారత్ విజయం సాధించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ పట్టుబిగిస్తోంది. రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి 270…
పారా ఒలింపిక్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పతకాలు కొల్లగొడుతూనే ఉన్నారు. అవని లేఖరా… ఒకే పారా ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. పతకాల పట్టికలో ఇండియా 37వ స్థానంలో నిలిచింది. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…ఈ నెల 9న పారా ఒలింపియన్లను కలుసుకోనున్నారు. భారత దేశ బంగారు బాలిక అవని లేఖారా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్గా…