మొదటి రెండో టెస్టు వరకూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది మన భారత బ్యాట్స్ మెన్ యేనా? అంతగా విరుచుకుపడ్డ వీరు మూడో టెస్ట్ నుంచి ఇలా అయిపోయిరేంటి? ఎందుకిలా పేకమేడలా కుప్పకూలుతున్నారు? అసలు మన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు ఏమైంది. పట్టుమని 10 పరుగులు చేయడానికి ఎందుకింతలా ఆపసోపాలు పడుతున్నారు? ప్రపంచ క్రికెట్లో భారత ప్లేయర్లకు మంచి గుర్తింపు ఉంది. మనోళ్లు బ్యాట్ పట్టారంటే ఫోర్లు.. సిక్సర్లు.. రన్సే రన్స్ అన్న లెవల్లో చెలరేగి పోతుంటారు.…
నేడు భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ లో టాస్ గెలిచినా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీం ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే గత మూడు టెస్టులలో ఒక్క మార్పు లేకుండా ఆదోని కోహ్లీ సేన ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. పేసర్లు షమీ. ఇషాంత్ స్థానంలో శార్దుల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు.…
ఆదాయం పెంపొందించుకోవడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. ఐపీఎల్ 2022 ఎడిషన్లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా.. ఏకంగా 5 వేల కోట్లు ఆర్జించనుంది. మరోవైపు.. ఫ్రాంచైజీల కొనుగోలుకు వ్యాపారదిగ్గజాలు పోటీ పడుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి బీసీసీఐ.. భారీ ప్రణాళికలు వేసింది. 2022 ఎడిషన్ ఐపీఎల్లో కొత్తగా రెండు జట్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఏకంగా 5 వేల కోట్లు ఆర్జించనుంది. ప్రస్తుతం ఐపీఎల్లో 8 జట్లు మాత్రమే ఉన్నాయి.…
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో రజత పతకం వచ్చి చేరింది. హైజంప్ లో అథ్లెట్ నిషాద్ కుమార్ ఈ పతకాన్ని సాధించారు. ఈ పతకం సాధించే సమయంలో 2.06 మీటర్లతో నిషాద్ కుమార్ ఆసియా గేమ్స్ రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఈ హైజంప్ లో యూఎస్ అథ్లెట్ 2.15 స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అయితే రజతం సాధించిన నిషాద్ కుమార్ కు ట్విట్టర్ వేదికగా ప్రధాని మొదటి శుభాకాంక్షలు తెలిపారు. అయితే…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ లో టీం ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఆతిథ్య జట్టు అయిన ఇంగ్లాండ్ భారత జట్టు మీద ఇన్నింగ్స్ పై 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే కుప్ప కూలిపోయింది. ఆ తర్వాత తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆతిథ్య జట్టు 432 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్(121)…
ఆమె బాలివుడ్ సూపర్ స్టార్…ఆయన క్రికెట్ సూపర్ స్టార్.. కాంబినేషన్ అదిరింది కదా. అనుష్క, కోహ్లీ ఎప్పుడూ సోషల్ మీడియా డార్లింగ్సే. ఈ స్టార్ కపుల్ ఎక్కడికి వెళ్లినా ..ఏం చేసినా అది న్యూసే. అవును మరి వారి చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. ప్రస్తుతం ఈ జంట తమ కూతురుతో కలిసి ఇంగ్లండ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ వీధులన్నీ తమవే అన్న లెవెల్లో విహరిస్తున్నారు. లంచ్ డేట్లతో జాలీగా గడుపుతున్నారు. అనుష్క ప్రస్తుతం జిలుగు…
టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీతో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ జైషా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్పై చర్చించినట్లు తెలుస్తోంది. కోహ్లీ సారథ్యంలోని…. టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే ప్రపంచకప్, 2021 టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఓడిపోయింది. దీంతో రాబోయే ఐసీసీ ట్రోఫీలను కచ్చితంగా గెలవాల్సినా వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. టీ-20 ప్రపంచకప్కు జట్టు కూర్పుపై కుడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఈ ఏడాది…
ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ ను బీసీసీఐ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్ లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో ఈ టోర్నీని యూఏఈకి మార్చింది బీసీసీఐ. అయితే తాజాగా ఈ ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 23 న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా 24న టీం ఇండియా మొదటి మ్యాచ్ పాకిస్థాన్ తో తలపడుతుంది. ఆ తర్వాత 31న న్యూజిలాండ్ తో నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్ తో…
భారత్-ఇంగ్లాండ్ మధ్య నిన్న రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్లు అద్భుతంగా రాణించారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(83) పరుగులు చేయగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(129) సెంచరీతో రెచ్చిపోయాడు. ఇక ఆ తర్వాత కోహ్లీ(42), జడేజా(40) పంత్(37) పరుగులు చేయగా పుజారా(9), రహానే(1)తో నిరాశపరిచారు. అయితే ఈ ఇన్నింగ్స్ లో ముగ్గురు భారత ఆటగాళ్లు డక్ ఔట్ కాగా…