తొలి రోజు ముగిసిన ఆట… రాణించిన అయ్యర్, జడేజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. కెరీర్లో ఆడుతున్న తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ రాణించాడు. 136 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సహకారం అందించాడు. జడేజా 100 బంతుల్లో 6 ఫోర్ల సహాయంతో 50 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు అభేద్యంగా 113 పరుగులు జోడించారు.
Read Also: రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్
Also Read
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 13 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అయితే మరో ఓపెనర్ శుభ్మన్ గిల్ (52) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ కోలుకుంది. పుజారా (26), కెప్టెన్ రహానె (35) స్కోరు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 3 వికెట్లు పడగొట్టగా.. సౌథీకి ఓ వికెట్ దక్కింది.
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!