ఐసీసీ టీ20 ర్యాంకులు.. భారత్ నుంచి ఒకేఒక్కడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ర్యాంకింగ్స్ను బుధవారం నాడు ఐసీసీ విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి టాప్-10లో ఒకే ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఆ ఆటగాడే కేఎల్ రాహుల్. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడు టీ20ల సిరీస్లో ఓపెనర్గా కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. దీంతో అతడు 729 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 809 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 805 పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ రెండో స్థానంలో ఉన్నాడు. 796 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్రమ్ మూడో స్థానంలో నిలిచాడు. 735 పాయింట్లతో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విభాగంలో శ్రీలంక ఆల్రౌండర్ హసరంగ 797 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు షాంసీ (784 పాయింట్లు), ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ జంపా (725 పాయింట్లు), ఇంగ్లండ్ ఆటగాడు రషీద్ (719 పాయింట్లు), ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ (710 పాయింట్లు) టాప్-5లో స్థానం దక్కించుకున్నారు. టాప్-10లో ఒక్క టీమిండియా బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. మరోవైపు ఆల్రౌండర్ల జాబితాలో మహ్మద్ నబీ (ఆప్ఘనిస్తాన్), షకీబ్ (బంగ్లాదేశ్), లివింగ్ స్టోన్ (ఇంగ్లండ్), మ్యాక్స్వెల్ (ఆస్ట్రేలియా), హసరంగ (శ్రీలంక) టాప్-5లో ఉన్నారు. ఆల్రౌండర్ల విభాగంలోనూ టాప్-10లో భారత ఆటగాళ్లకు స్థానం దక్కలేదు.
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!

మరోవైపు టీమ్ ర్యాంకుల విషయానికి వస్తే ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు టాప్-10లో ఉన్నాయి.
తాజావార్తలు
-
Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!