టీమిండియా క్రికెట్లో కీలక మార్పులకు నాంది పలుకుతున్నట్లు తెలుస్తోంది. భారత్-ఐర్లాండ్ మధ్య జూన్లో జరగనున్న రెండు టీ20 మ్యాచ్ల సిరీస్కు యువ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ ద్వారా గిల్కు మరింత బాధ్యతలు అప్పగించే దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గిల్ ఇప్పటికే రెండు వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. భారత సెలెక్టర్లు,…
టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను కోరినట్లు సమాచారం. పదవీకాలాన్ని 2027 వన్డే వరల్డ్ కప్ వరకు పొడిగించాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ గెలిచిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బీసీసీఐని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నాయట. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై బీసీసీఐ, అగార్కర్ కానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇప్పటికే ఐపీఎల్ 2025కు…
Sanju Samson Opens Up on Failures: టీమిండియా స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తన కెరీర్, లక్ష్యాల గురించి భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు వరల్డ్ కప్ గెలిపించడం తన చిన్ననాటి కల అని, దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కృషి చేశానని తెలిపాడు. వరల్డ్ కప్ లక్ష్యాన్ని సాధించాలనే కోరిక తన మనసులో ఎప్పుడూ ఉండేదని, దాన్ని ప్రతిరోజూ ఊహించుకుంటూ ధ్యానం చేసేవాడినని వెల్లడించాడు. తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు,…
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన క్రికెట్ కెరీర్ ప్రారంభ దశలో ఎదురైన ఒక ఆసక్తికర అనుభవాన్ని ఇటీవల వెల్లడించాడు. ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో తొలిసారి అడుగుపెట్టిన రోజు జరిగిన సంఘటన తన జీవితంలో ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని చెప్పాడు. తాను మొదటిసారి ముంబై డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లినప్పుడు కూర్చోవడానికి కూడా స్థలం లేదని గుర్తుచేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ తనకు కూర్చోవడానికి స్థలం ఇచ్చారని, ఆ స్థలమే…
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతో మంది క్రికెటర్ల కెరీర్లను తీర్చిదిద్దడంలో మహీ కీలక పాత్ర పోషించాడని చెప్పాడు. తన కెరీర్లో ఎదురైన ప్రతి కష్ట సమయంలోనూ తనకు అండగా నిలిచాడని గుర్తుచేసుకున్నాడు. నాలుగు లేదా ఐదు మ్యాచ్లలో పరుగులు చేయకపోయినా.. అది ఆటగాడి ప్రతిభకు అడ్డంకి కాదని ధోనీ నమ్మేవాడని చెప్పాడు. తక్షణ ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్తులో ఓ ప్లేయర్…
Golden Era of Indian Cricket: ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాల్లో పురుష, మహిళ, యువ జట్లు కలిసి మొత్తం ఎనిమిది ప్రధాన అంతర్జాతీయ ట్రోఫీలను గెలుచుకోవడం భారత క్రికెట్ శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస విజయాలు సాధించడం భారత క్రికెట్కు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ స్వర్ణయుగంలో భారత్ మొత్తం ఆరు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఈ స్వర్ణయుగంలో…
టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో మెగా టోర్నీ నుంచి నిష్క్రమించే దశ నుంచి.. అద్భుతంగా పుంజుకుని ఏకంగా టైటిల్ కొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన భారత్.. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి కప్ సొంతం చేసుకుంది. జట్టు విజయంలో ప్రతి భారత క్రికెటర్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సహచర ఆటగాళ్ల గురించి ఆసక్తికర…
భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వన్షిక చడ్డాను అతడు వివాహమాడాడు. ఉత్తరాఖండ్లోని అందమైన హిల్ స్టేషన్ ముస్సోరిలోని సవోయ్ హోటల్లో శనివారం కుల్దీప్, వన్షిక పెళ్లి ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు క్రికెటర్లు ఈ వేడుకలో పాల్గొన్నారు. సంగీతం, నృత్యాలతో కుల్దీప్ పెళ్లి వేడుకలు సందడిగా సాగాయి. వివాహానికి ముందు నిర్వహించిన సంగీత్ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ…
Team India ODI Squad Changes for 2027 ODI World Cup: భారత వన్డే జట్టులో త్వరలోనే కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు భవిష్యత్తులో భారత జట్టు వన్డే ప్రణాళికల్లో ఉండకపోవచ్చని సమాచారం. 2027 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ సెలెక్టర్లు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత వన్డే…
Prize Money : 2026 టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శనతో విశ్వవిజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుపై ప్రస్తుతం కాసుల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన అధికారిక బహుమతి నిధి (Prize Money) పంపిణీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బుధవారం వెల్లడించింది. మొత్తం 11.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 103 కోట్లు) పూల్ నుండి జట్ల ప్రదర్శన ఆధారంగా నిధులను కేటాయించారు. TGRPDCL: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు.. జీవో…