ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. వారసత్వంగా నాకు అప్పు వచ్చింది.. రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత కూడా నాపై ఉంది.. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తా అన్నారు..
Perni Nani : తమపై ఎన్ని కక్షపూరిత కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో సివిల్ సప్లై శాఖలో ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు పెడుతున్నారంటూ వాపోయారు. అసలు చట్టం ప్రకారం ఎవరిపై పెట్టకూడని కేసులు తన కుటుంబంపై పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వేధింపులు తనకు కొత్తేం కాదని.. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని…
Elamanchili: అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన రాజకీయం కీలక మలుపు తిరిగింది. చైర్ పర్సన్ రమా కుమారిపై ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకునేందుకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు యోచిస్తున్నారు.
Visakha Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది.
Pension Distribution: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ లు పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మందికి పైగా పెన్షన్లు పంపిణీ చేయనున్న ప్రభుత్వం.. ఇక, బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజక వర్గంలోని కొత్త గొల్లపాలెం, పెద్ద గంజాంలో పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారా? పార్టీ డీఎన్ఏలోనే ఉన్న క్రమశిక్షణ మెల్లిగా మాయమవుతోందా? సీఎం చంద్రబాబు హెచ్చరికల్ని సైతం కొందరు ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారా? పదే పదే చేస్తున్న హెచ్చరికల్ని కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు కొందరు? ఎమ్మెల్యేల మీద బాబుకు గ్రిప్ తగ్గుతోందన్న ప్రచారంలో నిజమెంత? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని పది నెలలు. పరిపాలనా పరంగా ఇది చాలా చిన్న సమయం. కానీ… ఈ టైంలోనే… కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు గాడి…
విశాఖను ఆంధప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ గా మార్చుతాం.. విశాఖ రీజియన్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోందన్నారు మంత్రి నారా లోకేష్.. ఆర్థిక వృద్ధిలో విశాఖను దేశంలోనే ఐదవ స్థానంలో నిలపాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఆయన.. విశాఖను ఒక బ్రాండ్ గా మార్చుతాం.. విశాఖలో 2029లోపు 5 లక్షల ఐటీ ఉద్యోగాలను కల్పిస్తామని స్పష్టం చేశారు..
CM Chandrababu: ఇవాళ ఉదయం 9. 30 గంటలకి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయనున్నారు.
ఒకప్పుడు ఆ పదవి తీసుకోమంటే…. అబ్బా… ఇప్పుడొద్దులే, చూద్దాంలే, చేద్దాంలే అంటూ ఎక్కడలేని సణుగుళ్ళూ సణిగిన నేతలంతా ఇప్పుడు పోటీ పడుతున్నారట. పైగా మాకంటే మాకంటూ పైరవీలు సైతం మొదలుపెట్టేశారట. అప్పట్లో ఎవరో ఒకరులే అనుకున్న టీడీపీ అధిష్టానం సైతం…. ఇప్పుడు ఆచితూచి అన్నట్టుగా ఉందట. ఉన్నట్టుండి అంతలా కాంపిటీషన్ పెరిగిపోయిన ఆ పదవి ఏది? ఎందుకు ఒక్కసారిగా అలా డిమాండ్ పెరిగిపోయింది? తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోందట. ఇన్నాళ్ళు రాష్ట్ర పార్టీ బాధ్యతలు…
టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. ఈ సందర్భంగా మాజీమంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి మాట్లాడుతూ.. “నిజమైన తెలుదేశం కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ తెలుగు ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేవటానికి పుట్టిన పార్టీ అని చెప్పారు.. ఆయన చెప్పిన చరిత్ర మామూలు చరిత్ర కాదు.. టీడీపీ ఆవిర్భవించిన రోజు చంద్రబాబు కాంగ్రెస్ జెండా మోస్తున్నారు.. ఇందిరా గాంధీ ఆజ్ఞాపిస్తే ఆయన మామ చంద్రబాబు…