Nationwide Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nationwide Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. నిజానికి ఇది వచ్చే వారం బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఆ రోజు అన్ని బ్యాంకులు మూసివేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ 27వ తేదీ సమ్మె జరిగితే, 24, 25, జనవరి 26న (గణతంత్ర దినోత్సవం) సెలవు కారణంగా బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు బంద్ అయినట్లు అవుతుంది.
READ ALSO: Tollywood Box Office: కొత్త సినిమాలే లేవు.. సంక్రాంతి విన్నర్స్కు గోల్డెన్ టైమ్..!
Also Read
- Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
- PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
- Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
ఒక వేళ సమ్మె జరిగితే సేవలు ప్రభావితమవుతాయని అనేక ప్రధాన బ్యాంకులు ఇప్పటికే వినియోగదారులకు తెలియజేశాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ నెల ప్రారంభంలో సమ్మె నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకులు, IBA ప్రతినిధులతో సహా చీఫ్ లేబర్ కమిషనర్తో సమావేశాలు జరిగాయి. కానీ ఎటువంటి పరిష్కారం రాలేదు. ఈ సమావేశం తరువాత జనవరి 27న సమ్మె చేయాలని యూనియన్లు నిర్ణయించాయి.
సమ్మె ఎందుకు చేస్తున్నారంటే..
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ప్రతి నెలా రెండవ, నాలుగవ శనివారాలు, అన్ని ఆదివారాలు సెలవులు ఇస్తున్నారు. నెలలోని అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2024 మార్చిలో వేతన ఒప్పందం సమయంలో దీనికి అంగీకరించారు, కానీ ఇంకా ఇది అమలు కాలేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తమ పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని యూనియన్లు చెబుతున్నాయి, అయినప్పటికీ ప్రభుత్వం వారి డిమాండ్ను విస్మరిస్తోందని తెలియజేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం జనవరి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి జనవరి 27వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు సమ్మె జరగనుంది. ఈ సమయంలో డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATMలను ఉపయోగించాలని SBIతో సహా అనేక ప్రధాన బ్యాంకులు కస్టమర్లకు సూచించాయి. అవసరమైతే కస్టమర్ సర్వీస్ పాయింట్లు కూడా తెరిచి ఉంటాయని తెలిపాయి.
READ ALSO: Farmer Success Story: గూగుల్ సలహాతో కోటీశ్వరుడైన రైతు..
తాజావార్తలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్షీట్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!