Nationwide Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఎందుకో తెలుసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nationwide Bank Strike: జనవరి 27న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. నిజానికి ఇది వచ్చే వారం బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఆ రోజు అన్ని బ్యాంకులు మూసివేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఒక వేళ 27వ తేదీ సమ్మె జరిగితే, 24, 25, జనవరి 26న (గణతంత్ర దినోత్సవం) సెలవు కారణంగా బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు బంద్ అయినట్లు అవుతుంది.
READ ALSO: Tollywood Box Office: కొత్త సినిమాలే లేవు.. సంక్రాంతి విన్నర్స్కు గోల్డెన్ టైమ్..!
Also Read
- NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
- RailOne Ticket Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టిక్కెట్స్ చెల్లవు.. కొత్త నిబంధనలు వెల్లడించిన భారతీయ రైల్వే
- Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
- Stock Market: ట్రంప్ దెబ్బ.. స్టాక్ మార్కెట్లో బ్లడ్బాత్
ఒక వేళ సమ్మె జరిగితే సేవలు ప్రభావితమవుతాయని అనేక ప్రధాన బ్యాంకులు ఇప్పటికే వినియోగదారులకు తెలియజేశాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ నెల ప్రారంభంలో సమ్మె నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకులు, IBA ప్రతినిధులతో సహా చీఫ్ లేబర్ కమిషనర్తో సమావేశాలు జరిగాయి. కానీ ఎటువంటి పరిష్కారం రాలేదు. ఈ సమావేశం తరువాత జనవరి 27న సమ్మె చేయాలని యూనియన్లు నిర్ణయించాయి.
సమ్మె ఎందుకు చేస్తున్నారంటే..
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులకు ప్రతి నెలా రెండవ, నాలుగవ శనివారాలు, అన్ని ఆదివారాలు సెలవులు ఇస్తున్నారు. నెలలోని అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2024 మార్చిలో వేతన ఒప్పందం సమయంలో దీనికి అంగీకరించారు, కానీ ఇంకా ఇది అమలు కాలేదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తమ పని గంటలను భర్తీ చేయడానికి ప్రతిరోజూ 40 నిమిషాలు అదనంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని యూనియన్లు చెబుతున్నాయి, అయినప్పటికీ ప్రభుత్వం వారి డిమాండ్ను విస్మరిస్తోందని తెలియజేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం జనవరి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి జనవరి 27వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు సమ్మె జరగనుంది. ఈ సమయంలో డిజిటల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATMలను ఉపయోగించాలని SBIతో సహా అనేక ప్రధాన బ్యాంకులు కస్టమర్లకు సూచించాయి. అవసరమైతే కస్టమర్ సర్వీస్ పాయింట్లు కూడా తెరిచి ఉంటాయని తెలిపాయి.
READ ALSO: Farmer Success Story: గూగుల్ సలహాతో కోటీశ్వరుడైన రైతు..
తాజావార్తలు
-
AI Training : మైనారిటీ విద్యార్థులకు ‘ఏఐ’ శిక్షణ.. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం
-
Sri Sri: గోడెక్కి పూజాతో దుల్కర్ లవ్ ముచ్చట్లు!
-
Korean Kanakaraju: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ లాక్!
-
Dharma Mahesh : హీరో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
-
BCCI Trolls: పర్ఫామెన్స్కు విలువ లేదా?.. సిఫార్సుల ద్వారానే ఛాన్స్లు.. టీమిండియా ఎంపికలపై విమర్శలు!
ట్రెండింగ్
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!