ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ, నారా లోకేష్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మండలిలో భూ కేటాయింపులపై వాడివేడి చర్చ నడుస్తోంది. కంపెనీలకు 99 పైసలకు ఎకరం భూములిచ్చారనే అంశంపై వాగ్వాదం నడిచింది. భూములిచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని గతంలోనే ఛాలెంజ్ చేశానని, వాళ్లు ఆధారాలు తీసుకురాలేకపోయారని మంత్రి లోకేష్ అన్నారు. క్రెడిబులిటీ ఉన్న కంపెనీలకే భూములు ఇస్తున్నాం అని లోకేష్ స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఎలా ఇస్తారు? అని శాసనమండలి విపక్షనేత బొత్స…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక కొత్త సంప్రదాయానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహించేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులతో మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకోవడంతో పాటు వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. Also Read: Vivo V70 Price: ‘వివో వీ70’ ప్రీబుకింగ్స్ ప్రారంభం.. అధికారిక…
ఆంధ్రప్రదేశ్లో కొందరు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి హెచ్చరికలతో కూడిన లేఖలు రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ పంపిన ఈ లేఖలపై భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ పీఎస్.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్లకు కూడా ఇదే తరహా హెచ్చరిక లేఖలు అందాయి. ఒకే విధమైన సందేశంతో పలువురు మంత్రులకు లేఖలు రావడం వెనుక…
కూటమి ప్రభుత్వ అక్రమాల పై రాజీలేని పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ, రాజీ పడమని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ నాయకుల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటినీ పరిశీలన చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులకు నజరాన ఇచ్చి ప్రమోషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. Also Read:Peddi Second Song: మెగా ఫ్యాన్స్కు గుడ్…
ఒకరు మాజీ ఎమ్మెల్యే…మరొకరు మేజర్ సిటీకి మేయర్. రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించే అన్నదమ్ములకు వ్యక్తిగతంగా మిస్టర్ కూల్ ఇమేజ్ ఉంది. అధికారం చేతుల్లో ఉన్నా మెత్తగా కనిపిస్తే మొత్తేస్తున్నారని అనుకున్నారో ఏమోగానీ….ఇటీవల ట్రెండ్ మార్చి సీమటపాకాయల్లా పేలుతున్నారు. త్యాగాలు చేస్తే చిన్న చూపు చూస్తారా…? అంటూ సొంత పార్టీ నాయకత్వం మీదే రుసరుసలాడుతున్నారు. మాకే ఎందుకిలా అని ఫీలవుకున్న ఆ నాయకులు ఎవరు? ఎక్కడ జరుగుతోందా ఎపిసోడ్? పీలా బ్రదర్స్…!. ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో ఈ…
కాపు కులంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు టైగర్ అని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటిని దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. అన్నింటికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకోండని.. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండని వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఈరోజు జగన్…
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయంలో ఇవాళ ( జనవరి 28న) కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది.
అమరావతిలో నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్తో ముందుకు సాగనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం.. పలు కీలక శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. పాలనను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే దిశగా శాఖల పనితీరుపై ఆయన సూచనలు, ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ వర్క్షాప్లో పాల్గొననున్నారు. జిల్లా కార్యవర్గాల కోసం ప్రత్యేకంగా…
Bandla Ganesh: టాలీవుడ్ నిర్మాత, ‘ఫైర్ బ్రాండ్’గా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం అంటూ ‘సంకల్ప యాత్ర’ పేరుతో ఒక పాదయాత్ర చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సమయంలో ఎంతకూ బెయిల్ రాకపోవడంతో, ఆయనకు బెయిల్ లభిస్తే కనుక.. తాను తన గడప నుంచి మీ గడప వరకు పాదయాత్ర చేస్తానంటూ తిరుమల శ్రీవారికి మొక్కుకున్నారట. READ ALSO: Mukesh Ambani: ముఖేష్…
ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం రాజీ పడబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో తాము ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలు ఇప్పుడు ‘సూపర్ హిట్’ అయ్యాయని, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ (దీపం-2), అన్నదాత సుఖీభవ వంటి…