రాష్ట్ర రాజకీయాల్లో బాగా పాపులర్ అయిన ఆ ముగ్గురు టీడీపీ ముఖ్యులు ఒక వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి అడ్డంగా బుక్ అయ్యారా? కేవలం కాసు కక్కుర్తితోనే వాళ్ళు ఆ పని చేయబోయారా? కథ క్లైమాక్స్లో టీడీపీ అధిష్టానానికి తెలిసి తలంటేసిందా? ముగ్గురి పరిస్థితి ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా మారిపోయిందా? ఎవరా ముగ్గురు? ఈ కథలో రాయలసీమకు చెందిన ఓ మంత్రి వియ్యంకుడి పాత్ర ఏంటి? కాకినాడ జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు…
ఆ సీనియర్ ఎమ్మెల్యే అయినోళ్ళకు ఆకుల్లోనూ, కాని వాళ్ళకు కంచాల్లోనూ వడ్డిస్తున్నారా….? జెండా మోసింది మేమైతే….. జమా ఖర్చులు చూసేది వేరావాళ్ళా అంటూ పాత టీడీపీ సీనియర్స్ కారాలు మిరియాలు నూరేస్తున్నారా…?. ఈ లెక్కల తేడాలే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టీడీపీ ప్రెసిడెంట్కు మధ్య మంట పెట్టాయా? టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ ఎక్కడ నడుస్తోంది? కొత్త కుంపట్లతో లాభ నష్టాల సంగతేంటి? అనకాపల్లి జిల్లా చోడవరం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్ధుల కంటే…
తెలంగాణకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసి విభజన చేయాలని కోరామని, రాజధాని లేకుండా ఏపీని విభజించారన్నారు. తెలుగుజాతి కోసం సైబరాబాద్, హైటెక్ సిటీ నిర్మించామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపితేనే తాను ప్రమాణం చేస్తానని చెప్పానని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. పుష్కరకాలం కింద…
కొండ నాలికకు మందు వేస్తే…ఉన్న నాలిక ఊడినట్టయ్యిందని టీడీపీ భావిస్తోందా ? ఎక్కడి నుంచో తీసుకొచ్చి…ఇక్కడ ఎంపీగా అవకాశం ఇస్తే…పార్టీని కంపు కంపు చేసేశాడా ? ఆయనతోపాటు మనము పాతుకుపోదాం అనుకున్న నేతల పునాదులు కదిలినట్టు భావిస్తున్నారా ? అటు పార్టీకి…ఇటు వ్యక్తిగతంగా జరిగిన డ్యామేజ్ను కవర్ చేసేందుకు అనుచరులు ప్రయత్నిస్తున్నారా ? ఇంతకీ ఎవరా నేత ? ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పరిస్థితి…ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుగా తయారైందని పార్టీ నేతలు…
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ తండ్రికి సీఎం సహాయనిధి ద్వారా వైద్యసాయం అందించి ఆదుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఏ.అరవింద్ మంత్రి లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా…
తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడతలో భాగంగా 2,50,893 మంది పేదలకు గృహప్రవేశం కల్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలో నాయుడుపేటలో టిడ్కో లబ్ధిదారులతో కలిసి సీఎం సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది కుటుంబాలు…
తిరుపతి జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నాయుడుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అధికారిక సమావేశాల్లో కూడా సీఎం పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం ఉదయం 11.30 గంటలకు దొరవారిసత్రం మండలం నెల్లబల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి పుదూరు గ్రామానికి వెళ్లి.. కొత్తగా నిర్మించిన ఏపీ టిడ్కో గృహాలను ప్రారంభించనున్నారు. గృహ నిర్మాణ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఇది…
అమరావతిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ రాజకీయాలపై ప్రభావం చూపిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని, ఇది చరిత్రలో నిలిచిపోయే నిజమని అన్నారు. పార్టీ ఎదుగుదలలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని, జెండా మోసే కార్యకర్తలే నిజమైన నాయకులని లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించడం తన బాధ్యతగా భావిస్తున్నానని లోకేష్…
ప్రభుత్వంలో లోపాలంటూ ఒక రోజున మెసేజ్ పెడతారు. ప్రతిపక్షానికి కనువిప్పు కావాలంటూ మరో రోజున ఎక్స్లో రియాక్ట్ అవుతారు. ఇంతకీ…. ఆ టీడీపీ ఎమ్మెల్యే మనసులో ఏమనుకుంటున్నారు? కూటమి సర్కార్ని ఇరుకున పెట్టాలన్నది ఆయన లక్ష్యమా? లేక రేపటి పరిణామాలను ముందే ఊహించి సేఫ్ అండ్ డబుల్ గేమ్ ఆడుతున్నారా? ఎవరా శాసనసభ్యుడు ఏంటా 360 డిగ్రీస్ ట్వీట్స్ ఎపిసోడ్? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫస్ట్టైం ఎమ్మెల్యే అయ్యారు కొలికపూడి శ్రీనివాస్. మొదట్లో…
తమ్ముళ్ళు తమ్ముళ్ళు తన్నుకుని అసలు సీక్రెట్స్ అన్నిటినీ బయటపెడుతున్నారా? వాళ్ళ గొడవలతో…. కళ్ళు బైర్లుకమ్మే స్థాయిలో జరుగుతున్న ఇసుక దందా బయటికొచ్చిందా? మేం వాళ్ళ మనుషులం, వీళ్ళ మనుషులమని చెప్పి వాగులు, వంకల్ని సైతం దోచేస్తున్న తంతు ఎక్కడ జరుగుతోంది? టీడీపీలోని రెండు వర్గాలకు ఎప్పుడు? ఎక్కడ తేడా కొట్టింది? చిత్తూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇసుక సెగలు రేగుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోనే ఓ వర్గం చేస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని మరో వర్గం లీక్…