Earth Water: భూ గ్రహంపైకి నీరు ఎలా వచ్చింది.? నాసా సమాధానం ఇదే..
- భూమి పైకి నీరు ఎలా వచ్చింది..?
- నాసా జరిపిన పరిశోధనల్లో కీలక విషయాలు..
- ఉల్కల పాత్ర తక్కువే అనే అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earth Water: ఈ విశ్వంలో దేవుడు సృష్టికి అద్భుత సాక్ష్యం మనం నివసిస్తున్న ‘‘భూగ్రహం’’. అత్యంత పక్కాగా ఒక నక్షత్రం నుంచి ఎంత దూరంలో ఉంటే జీవజాలం మనుగడ సాధ్యం అవుతుందో అలాంటి ‘‘గోల్డెన్ లాక్ జోన్’’లో భూమి ఉంది. అయితే, మొదట జీవం సముద్రాల్లో పుట్టిందని అనేక థియరీలు చెబుతాయి. ఇలాంటి సముద్రాల్లోకి నీరు ఎలా వచ్చిందనేది ఇప్పటికీ చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి నాసా అధ్యయనం సమాధానం ఇస్తోంది. భూమిపై ఉన్న నీటిలో ఎక్కువ భాగం గ్రహం ఏర్పడినప్పుడే ఉన్న మూల పదార్థాల నుంచి వచ్చిందని నాసా నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. 4 బిలియన్ ఏళ్లలో ఉల్కలు భూమికి తీసుకువచ్చిన నీటి పరిమాణం చాలా తక్కువ అని ఈ పరిశోధన వెల్లడించింది.
Read Also: Gen Z: కార్పొరేట్ ఇండియాకు యువత మాస్ వార్నింగ్.. 23వేల మంది చెప్పిన నమ్మలేని నిజం!
Also Read
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
- Pakistan Minister: "చేతులు నరికేస్తాం".. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
- Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
అపోలో మిషన్ల సమయంలో చంద్రుడి నుంచి సేకరించిన మట్టి నమూనాలను విశ్లేషిస్తూ, ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. దీని ఫలితాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (PNAS) జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనానికి నాసా జాన్సన్ స్పేస్ సెంటర్కు చెందిన సైంటిస్ట్ టోనీ గార్గానో నేతృత్వం వహించారు. చంద్రుడి మట్టిలో కనీసం 1 శాతం వరకు కార్బన్ అధికంగా ఉన్న ఉల్కల పదార్థం ఉన్నట్లు తేలింది. ఈ ఉల్కలు చంద్రుడిని ఢీకొన్నప్పుడు కొంత వరకు ఆవిరైపోయాయని పరిశోధకులు గుర్తించారు. భూమి మీద ఉల్కల ప్రభావం చంద్రుడితో పోలిస్తే సుమారు 20 రెట్లు ఎక్కువగా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్నా, ఉల్కల ద్వారా భూమికి చేరిన నీటి పరిమాణం చాలా స్వల్పమేనని ఈ అధ్యయనం తేల్చింది.
ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ట్రిపుల్ ఆక్సిజన్ ఐసోటోప్స్ అనే పద్ధతిని ఉపయోగించారు. ఉల్కలు ఢీకొన్న సమయంలో తీవ్రమైన వేడి, ఆవిరీకరణ జరిగినా, ఆక్సిజన్ ఐసోటోప్స్ మారకుండా ఉండటం వల్ల, అవి ఉల్కల నుంచి వచ్చిన పదార్థాన్ని గుర్తించడానికి కీలక ఆధారంగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బిలియన్ ఏళ్లుగా భూమి పరిసర ప్రాంతంలో ఏ రకమైన ఉల్కలు పడ్డాయనే ఆధారాలను చంద్రుడి మట్టే అందిస్తుందని, భూమిపై భూగర్భ కదలికలు, వాతావరణ ప్రభావం ఈ చరిత్రను చెరిపేస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. చంద్రుడి ధ్రువాల వద్ద నీరు ఉందని ఇప్పటికే గుర్తించారు. ఇది నాసా నిర్వహిస్తున్న ఆర్టెమిస్ మిషన్లకు కీలకం అవుతుంది. ఈ అధ్యయనం 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి అపోలో మిషన్ల ద్వారా తీసుకువచ్చిన మట్టితో చేశారు.
తాజావార్తలు
-
Brahmanandam: బ్రహ్మాజీ పరువు తీసేసిన బ్రహ్మానందం!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Gudivada Amarnath: జగన్ పాదయాత్రతో కూటమికి ‘పాడే యాత్రే’.!
-
Lenin Trailer : అక్కినేని ఫ్యాన్స్కు పూనకాలే.. ‘లెనిన్’ ట్రైలర్లో కరుక్షేత్రం చూశారా?
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులు కడుతూనే.. రైతులకు డబుల్ సాయం చేస్తున్నాం
ట్రెండింగ్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ