CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు (ఏప్రిల్ 5న) ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో పర్యటించనున్నారు. బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ముప్పాళ్లలో ఏర్పాటు చేస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు.
మా త్యాగాలకు మీరిచ్చే విలువ ఇదేనా? సర్దుబాటు పేరుతో మేం ఎప్పటికీ త్యాగరాజులుగానే మిగిలిపోవాల్నా? నిన్నగాక మొన్న వచ్చినవాళ్ళు పెత్తనాలు చేస్తుంటే…. ఐదేళ్ళు నానా తంటాలు పడి కేడర్ని నిలుపుకున్న మేం మాత్రం సినిమా చూసినట్టు చూస్తూ… చప్పట్లు కొట్టాల్నా? ఏంటీ మాకీ ఖర్మ అంటున్నారట కీలకమైన ఆ జిల్లాలోని టీడీపీ లీడర్స్. ఎక్కడుందా పరిస్థితి? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది? 2024 అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ…
ఎమ్మెల్సీ నాగబాబు కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో పర్యటిస్తున్నారు. గొల్లప్రోలు మండలంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ను నాగబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా టీడీపీ-జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. అన్న క్యాంటీన్ను నాగబాబు ఓపెన్ చేస్తుండగా.. జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో…
వైసీపీలో అధికారికంగా ఎలాంటి నంబర్స్ లేకున్నా... నంబర్ టూ అని చెప్పుకునే విజయసాయి రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నానని, తాను మాత్రం ఇక వ్యవసాయం చేసుకుంటానంటూ కొత్త పలుకులు పలికారు. ఓహో... అలాగా.... అని అంతా అనుకుంటున్న టైంలోనే... కాకినాడ పోర్ట్ కేసు విచారణకు అటెండ్ అయిన సాయిరెడ్డి...
అనకాపల్లి జిల్లా... యలమంచిలి సెగ్మెంట్లో కూటమి పాలిటిక్స్ హాట్ మెటల్లా సలసలమంటున్నాయి. టీడీపీ, జనసేన మధ్య అంతర్గత రచ్చ బజారుకెక్కింది. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దూకుడుని తట్టుకోవడం టీడీపీ నేతలకు మహా కష్టంగా మారిందట. ఇది కొత్తగా వచ్చిన ఇబ్బంది కాదని.. పొత్తులు పుట్టినప్పుడే ఇలాంటి బుల్డోజ్ రాజకీయాల్ని ఊహించామంటూ ఘొల్లుమంటున్నాయి టీడీపీ శ్రేణులు. కూటమి ధర్మానికి కట్టుబడి శాసనసభ్యుడు వ్యవహరిస్తారని ఆశించినప్పటికీ పరిస్ధితుల్లో మార్పు రాలేదని బహిరంగానే అంటున్నారట.
మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. నారా లోకేష్ అవకాశం వచ్చినప్పుడల్లా స్థాయిని మించి మాట్లాడుతున్నారు.. వైఎస్ జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.. కళ్లు నెత్తి మీదకి ఎక్కి... వాపును బలం అనుకుని ఒళ్లు బలిసి లోకేష్ మాట్లాడుతున్నాడు.. లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకో.. 2019లో పార్టీ ఓడిపోవడానికి మీరు కూడా ఒక కారణం అని గుర్తుంచుకోండి..
దశాబ్దాలుగా నివాసం ఉంటున్న చోటే పట్టాలు ఇవ్వాలని కోరారు.. మొదటి విడతగా మూడు వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామన్నారు. అయితే, నేను మొదటిసారి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయా.. మొదటి రోజు బాధపడినా మరుసటి రోజు నుంచి ప్రజల మనసులు గెలవాలని పని చెయ్యడం మొదలు పెట్టాను అని మంత్రి లోకేష్ వెల్లడించారు.
AP Cabinet Meeting: ఇవాళ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఈ భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధనాంగా చర్చ జరగనుంది. డ్రోన్ పాలసీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ముస్లిం సమాజంలోని ఒక వర్గం దీనికి మద్దతు ఇస్తుండగా, మరొక వర్గం వ్యతిరేకంగా ఉంది. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ, దాని మిత్రపక్షాలు ఐక్యంగా ఉండగా, ఇండియా బ్లాక్ దీనికి వ్యతిరేకంగా వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్లో ఈ వక్ఫ్ బిల్లుపై వాదనలు జరుగుతున్నాయి. పార్లమెంటులో చర్చకు ఎనిమిది గంటలు కేటాయించారు. ఇందులో ఎన్డీఏకి మొత్తం 4 గంటల 40 నిమిషాల…
Minister Lokesh: ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో 375 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీతో కలిసి లోకేశ్ పాల్గొననున్నారు.