దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. మీ పెతాపమో.. మా పెతాపమో తేల్చుకుందాం అని సవాళ్లు విసిరిన టీడీపీకి..ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయా? తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారా? మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తిని చాటుకోక తప్పదా? ఏపీలో వివిధ కారణాలతో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎలక్షన్స్ జరిగినప్పుడు నామినేషన్ల దాఖలు, ఏకగ్రీవాల విషయంలో అధికారపార్టీ…
కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ను కోరారు. శుక్రవారం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం ఎస్ఈసీని కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.…
అనంతపురంజిల్లా పెనుకొండలో నగర పంచాయితీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే పార్థసారథి తరలివచ్చి ప్రతి కౌన్సిలర్ అభ్యర్థికి తానే అన్నీ చూసుకుంటూ దగ్గరుండి నామినేషన్ లు వేయించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ పెనుకొండ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోతామనే పక్క జిల్లాల నుంచి కేవలం ఎమ్మెల్యేలను పిలిపించుకుని అధికారం తో గెలవాలని చూస్తుందన్నారు. ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ…
గురజాల అభివృద్ధిపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అంటూ గురజాల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్ విసిరారు. గురజాలలో టీడీపీ ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి. దాచేపల్లి నడిసెంటర్లో అయినా సరే, బొడ్రాయి సెంటర్ లో అయినా సరే, చర్చకు నేను ఒక్కడినే వస్తా, లెక్కలు తేల్చుకొని వెళ్తా, టీడీపీ వారు సిద్ధమా’ అంటూ ఛాలెంజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, మేము నిజంగా అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు…
సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో భారీ స్కామ్ జరిగిందంటూ టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సౌర విద్యుత్ కొనుగోళ్లల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందన్న ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం తొమ్మిది వేల మెగా వాట్ల సౌర విద్యుత్ కొన్నామని విపరీతంగా ప్రచారం చేసుసుంటోందని, 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని అన్నారు. అలాగే గుజరాత్…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ లో వున్నాడని…చురకలు అంటించారు ఎమ్మెల్యే ఆర్. కె రోజా. ఇవాళ ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. నిన్న పండగ పూట ఎన్నిక లేంటి అని అంటున్నాడని… ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికల కమిషన్ కు సంబంధం ఏమిటి ? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నపుడు అన్ని నచ్చాయని… ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కమిషనర్ నిర్ణయాలు తప్పులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలకు…
కుప్పంలో మున్సిపల్ ఎన్నికల వార్ హీటు పెంచుతుంది.. మాజీ సీఎం, టీడీపీ అధినేత సొంతం నియోజకవర్గం కావడం.. వైసీపీ ఆ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో మున్సిపల్ వార్ హీట్ పెంచుతుంది.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్స్వీప్ చేసింది.. కుప్పంలోనూ అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని దీమాతో ఉంది.. దీంతో.. సొంతగడ్డపై చంద్రబాబుకి మరో ఛాలెంజ్ ఎదురవుతోంది. కేడర్కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. అటు తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని సీన్లోకి…
గ్రేటర్ విశాఖపట్నం మున్సిప్ కార్పోరేషన్ పరిధిలో 31వ వార్డు కార్పొరేటర్ పదవికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యం అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే వానపల్లి రవికుమార్ సతీమణి గాయత్రిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయం. అనితర ప్రజా సేవ చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే పోటీ చేయకూడదన్న రాజకీయ విలువలకు పార్టీ…
చిత్తూరు జిల్లాలో ఆ ఇద్దరు నాయకుల మధ్య వైరం పీక్స్కు చేరింది. ఓపెన్గానే సవాళ్లు విసురుకుంటున్నారు. మాటలతో ఒకరు.. కవ్వింపులతో ఇంకొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. దీంతో పుంగనూరు గిత్తకు పొగరెంత అని లెక్కలేసుకుంటున్నాయి శ్రేణులు. వారెవరో.. ఏంటో లెట్స్ వాచ్..! చంద్రబాబు కుప్పంలో గెలవలేరని మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్..! చిత్తూరు జిల్లా రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. టీడీపీ అధినేత చంద్రబాబు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకొనే…
ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా ఆ జిల్లా టీడీపీ నేతలు ఇబ్బంది పడుతున్నారట. మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో.. కొత్త తలపోట్లు మొదలైనట్టు టాక్. ఎన్నికల్లో ఇంఛార్జ్గా ఉన్నా.. ఫైనాన్స్ మేటర్స్ డీలింగ్ ఎలా అని ఒకటే మథన పడుతున్నారట. పెనుకొండ మున్సిపాలిటీపై టీడీపీ ఫోకస్..! ఏపీలో ఏ ఎన్నికలు వచ్చినా టీడీపీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు కాస్తభిన్నంగా ఉంటాయి. అధినేత వ్యూహాలను ఊహించడం తెలుగు తమ్ముళ్లకు కూడా సాధ్యం కాదు. ఒక్కోసారి చిన్న ఎన్నికలైనా…