కుప్పంలో ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలి : టీడీపీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ను కోరారు. శుక్రవారం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం ఎస్ఈసీని కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.
కుప్పంలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ దాడి చేసిందని, వైసీపీ అభ్యర్థుల నామినేషన్లని అధికారులే దగ్గరుండి వేయిస్తున్నారని, ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలంటే వైసీపీకే ఓటేయాలని అధికారులే ఒత్తిడి తెస్తున్నారన్నారు. కుప్పంలో ప్రత్యేక ఎన్నికల అధికారిగా నియమించిన లోకేష్ వర్మను తప్పించాలని ఎస్ఈసీని కోరామని వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
కుప్పంలో వైసీపీ నిర్వహించిన సభలో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కుప్పంలో వైసీపీ సభ నిర్వహించిందన్నారు. కుప్పం స్పెషలాఫీసర్ వైసీపీ కార్యకర్తగా పని చేస్తున్నారని, ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎస్ఈసీ మీదే ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SIP: రూ.2000 SIPతో కోటీశ్వరులు కావాలంటే.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలో తెలుసుకోండి!
-
RCB IPL 2026 Playoffs: ఆర్సీబీకి భారీ షాక్.. ప్లేఆఫ్స్ రేసులో కొత్త టెన్షన్!
-
DRDO TARA Test: డీఆర్డీఓ స్వదేశీ ‘తారా’ కిట్ టెస్ట్ సక్సెస్.. శత్రువులకిక దబిడి దిబిడే
-
Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
-
Shakti Kapoor: తన మరణ వార్తలపై.. కౌంటర్ ఇచ్చిన శక్తి కపూర్