స్టైల్ మార్చిన చంద్రబాబు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు మారిపోయార్సార్ అంటున్నారు తమ్ముళ్లు..అయితే ఈ మార్పు ఫుల్ టైమా లేక, టెంపరరీనా అని అనుమాన పడుతున్నారట.అధికారానికి దూరమైన సమయంలో వచ్చిన మార్పు నమ్మశక్యంగా లేదనుకుంటున్నారట.ఇదే తీరు గతంలో కూడా ఉండి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా అనుకుంటున్నారని టాక్.
ప్రతిపక్షంలోకి వచ్చాక చంద్రబాబు స్టైల్ మారిందా? అధికారంలో ఉండగా దర్శన భాగ్యమే గగనంగాడే పరిస్థితి. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక నేరుగా కార్యకర్తలతో ఫోన్-ఇన్ కార్యక్రమాలు నడిపించేస్తున్నారట. ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో ఉండే సామాన్య కార్యకర్తలతో మాట్లాడుతున్నారట చంద్రబాబు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో అయితే, రోజుకు ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతోన్న సందర్భాలూ ఉంటున్నాయట. ఈ మార్పు మంచిదే. కానీ అది శాశ్వతంగా ఉంటుందా..? అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఉండడమనేది రాజకీయ పార్టీల నేతలకు.. సర్వసాధారణమైన అంశమే. ఆయా ఆ పార్టీ.. ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లోనూ.. ఆయా నేతల గురించి.. ఆ పార్టీల అధినాయకుల గురించి చర్చించుకుంటూనే ఉంటారు. ఇక తెలుగుదేశం పార్టీలో అయితే ఇది రోటీన్ వ్యవహరంగా కన్పిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా కార్యకర్తలతో వ్యవహరించడం తెలుగుదేశాధినేత చంద్రబాబుకు అలవాటే. ప్రస్తుతం షరా మామూలుగానే తన పంథాను మార్చారు చంద్రబాబు.
అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబులో తేడా బాగా కన్పిస్తోందట. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలు.. పార్టీ నేతలు గురించి పదే పదే ప్రస్తావించేవారని.. వాళ్లకి రెగ్యులర్గా అప్పాయింట్మెంట్లు ఇచ్చేవారని.. కానీ ఇప్పుడు ఆ స్టైల్ మార్చేసి, మరింత దగ్గరయ్యేలా బాబు వ్యవహరిస్తున్నారనట.
ముఖ్యంగా ప్రస్తుత ప్రతిపక్ష పాత్రలో కార్యకర్తలతో.. క్షేత్ర స్థాయిలో పని చేసే నేతలతో చంద్రబాబు నేరుగా టచ్లోకి వెళ్లిపోతున్నారట. ఏదైనా ఇబ్బంది క్షేత్ర స్థాయిలో ఓ కార్యకర్తకు వస్తే వెంటనే సదరు కార్యకర్తకు ఫోన్ చేసి మాట్లాడేస్తున్నారట. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాచవరంలో ఓ మహిళా కార్యకర్తకు నామినేషన్ వేసే విషయంలో ఇబ్బంది ఎదురైతే ప్రెస్ మీట్ నుంచే నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. అండగా ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే కుప్పంలో దాడికి గురైన రమేష్ అనే కార్యకర్తకు అదే విధంగా ఫోన్ చేసి పరామర్శించారు.
అయితే ఇదేదో స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యవహరం కాదట.. చంద్రబాబు రెగ్యులర్గానే ఈ తరహాలో నేరుగా కార్యకర్తలకు టచ్లోకి వెళ్తున్నారట. చంద్రబాబు ఈ తరహాలో నేరుగా కార్యకర్తలతో టచ్లోకి వెళ్లడంతో పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇదేదో అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా అంటున్నాయి పార్టీ వర్గాలు. అధికారంలోకి ఉన్నప్పుడు టచ్మీ నాట్ అన్నట్టు ఉండడం దేనికి..? అధికారం కొల్పోయాక.. కీప్ ఇన్ టచ్ అంటూ ఫోన్లు చేయడం దేనికంటూ గుసగుసలు పోతున్నారు.
ఇంతా చేస్తున్నా.. పార్టీ కార్యకర్తల్లో మాత్రం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టే ఎక్కడా లేని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చూపిస్తూ…. నేరుగా ఫోన్లు చేస్తున్నారని.. పార్టీ అధికారంలోకి వస్తే మాతో ఈ విధంగా ఉండగలరా అనేది అనుమానమేనని అంటున్నారట. అవసరం వచ్చినపుడు ఒకలా, అవసరం లేనప్పుడు మరోలా ఉండటం వల్ల అధినేతలకు క్రెడిబులిటీ సమస్య వస్తుందని చర్చించుకుంటున్నారట తమ్ముళ్లు. తమని కరివేపాకులా చూడకుండా ఉంటే బాగని ఆశిస్తున్నారట. కార్యకర్తలు ఏమనుకున్నా.. ఎలా అనుకున్నా.. చంద్రబాబులో ప్రస్తుతం వచ్చిన మార్పు.. శాశ్వతంగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారట పార్టీ నేతలు. మరి చంద్రబాబు అలా ఉంటారా..?
తాజావార్తలు
-
Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
-
RBI: బీ అలర్ట్.. రూ.500 నోట్లపై ఆర్బీఐ కీలక విషయం వెల్లడి..
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!