కుప్పంలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల నగారా మోగిననాటి నుంచి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు సవాల్లు ప్రతి సవాల్లు చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాతా కుప్పం 14వ వార్డుకు కౌన్సిలర్ నామినేషన్ వేసిన టీడీపీ రెండో అభ్యర్థి ప్రకాష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. ఇదే వార్డుకు వెంకటేష్ అనే వ్యక్తి కూడా టీడీపీ తరుపున నామినేషన్ వేశారు. కానీ స్రూటినీలో వెంకటేశ్ నామినేషన్ సక్రమంగా లేనందువలన తొలగించబడింది.
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చంద్రబాబు పీఎ మనోహర్, టీడీపీ నేతలు పీఎస్ మునిరత్నం, మాజీ సర్పంచ్ వెంకటేష్ లు నా తమ్ముడు ప్రకాష్ తోపాటు , అతని భార్య ను, అతని పిల్లలు ఇద్దర్నీ బెదిరించి దౌర్జన్యంగా తీసుకెళ్లారని, వారి ఆచూకీ లేదని ప్రకాష్ అన్న గోవిందరాజులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ కి చెందిన అభ్యర్ధినే ఇలా కిడ్నాప్ చేయడం దారుణం అంటున్న ప్రకాష్ అన్న గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు.