బెజవాడ టీడీపీ రాజకీయాల్లో కుదుపు. టీడీపీ కి మరో షాక్ తగిలింది. పశ్చిమ నియోజకవర్గంకు చెందిన కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య టీడీపీ గుడ్ బై చెప్పారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ లో చేరారు లావణ్య. ఇటీవల జరిగిన విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో లావణ్య టీడీపీ తరఫున గెలిచారు. విజయవాడ కార్పోరేషన్ కైవసం చేసుకోవాలని టీడీపీ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించి ప్రచారం చేశారు. చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ అక్కడ వైసీపీ హవా ముందు టీడీపీ కార్పోరేటర్లు గెలవలేకపోయారు. మొత్తం 64 స్థానాల్లో 41 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో విజయవాడ మేయర్ పీఠాన్ని వైసీపీ చేజిక్కించుకుంది. 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే 11వ డివిజన్ నుంచి టీడీపీ మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత విజయం సాధించారు. తాజాగా కార్పోరేటర్ మైలవరపు లావణ్య వైసీపీలో చేరడంతో టీడీపీ బలం తగ్గింది.